• facebook
  • whatsapp
  • telegram

శాస్త్ర సాంకేతిక రంగం - భారతదేశ ప్రణాళికలు

భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధిలో ప్రణాళికలు ప్రముఖ పాత్ర పోషించాయి. దేశ ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించారు.

* విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి కోసం పరిశోధనా-అభివృద్ధి (Research and Development) విభాగాన్ని ఏర్పాటు చేశారు.

* 1950లో ఏర్పడిన ప్రణాళికా సంఘం శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారా దేశాభివృద్ధికి కావాల్సిన విధి విధానాలను రూపొందించింది. వీటి కోసం వివిధ శాస్త్రవేత్తలు, జాతీయ-ప్రయోగ సంస్థలు, విశ్వవిద్యాలయాల అధికారుల అభిప్రాయాలను తీసుకుంది.

* భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధికి దోహదపడుతున్న కీలకరంగాలను (Thrust areas) గుర్తించాలని పరిశోధనా సంస్థలను ఆదేశిస్తుంది. ఆయా రంగాలు వేగంగా అభివృద్ధి చెందేందుకు కావాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలను రూపొందించాలని సూచిస్తుంది. 

* ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక రంగాల మార్గదర్శకాల రూపకల్పనకు ప్రతీ విభాగం నుంచి సలహాలను స్వీకరించి, సమీక్షలు నిర్వహిస్తుంది.

పంచవర్ష ప్రణాళికలు - శాస్త్ర సాంకేతికరంగ అభివృద్ధి

మొదటి పంవచర్ష ప్రణాళిక (1951-56)

* దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి ప్రయోగశాలలు, పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

* శాస్త్ర పరిశోధన సాయంతో మెరుగైన ఉత్పత్తులు సాధించాలని, ప్రయోగశాలల్లో పనిచేసే సిబ్బందికి కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇవ్వాలని, నూతన అన్వేషణల కోసం వనరులను అందించాలని నిర్దేశించారు.

రెండో పంచవర్ష ప్రణాళిక (1956-61)

పరిశోధనలకు అవసరమైన మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్దేశించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జాతీయ, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయి సంస్థల్లో జరుగుతున్న ప్రయోగాలు లేదా పరిశోధనా ఫలితాలను సమన్వయపరచి, ఆ పరిశోధనలకు కావాల్సిన సిబ్బందిని నియమించి వారికి శిక్షణను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పరిశోధనా ఫలితాలను పారిశ్రామిక రంగాలకు అన్వయించి మెరుగైన ఉత్పత్తిని పొందాలని భావించారు.

* ఈ ప్రణాళికా కాలంలోనే (1958లో) మన మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, హోమి జహంగీర్‌ బాబా ఆధ్వర్యంలో మొదటి సైంటిఫిక్‌ పాలసీ రూపొందింది.

మూడో పంచవర్ష ప్రణాళిక (1961-66)

* ఈ సమయంలో అప్పటివరకు ఏర్పాటు చేసిన పరిశోధనా సంస్థలను బలోపేతం చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. శాస్త్ర సాంకేతిక రంగాల మౌలిక అంశాల పరిశోధనకు, ఇంజినీరింగ్‌-టెక్నాలజీలో పరిశోధనకు అవసరమైన సౌకర్యాలను ప్రోత్సహించాలని సూచించారు. వీటికి కావాల్సిన మానవ వనరులను అభివృద్ధి చేయడానికి వారికి ఉపకారవేతనాలు, ఫెలోషిప్‌లను అందించాలని నిర్ణయించారు.

నాలుగో పంచవర్ష ప్రణాళిక (1969-74)

పరిశోధనా-అభివృద్ధి విభాగంలో ప్రాధాన్యత రంగాలుగా స్టీల్, రసాయనాలు, పరికరాల తయారీని గుర్తించారు. 

* ప్రయోగశాలలు, పరిశ్రమలు, ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీలకు కావాల్సిన సమాచారాన్ని అందించి వాటికి అవసరమైన నివేదికలు సమర్పించాలి. 

* ఈ ప్రణాళికా కాలంలో వివిధ ప్రయోగశాలల్లో జరుగుతున్న ఒకేరకమైన పరిశోధనలను (Duplication work) తగ్గించాలని నిర్ణయించారు. అంతరిక్ష పరిశోధనలపై దృష్టి సారించాలని భారత ప్రభుత్వం సూచించింది.

అయిదో పంచవర్ష ప్రణాళిక (1974-79)

అప్పటివరకు దేశంలో జరుగుతున్న వివిధ పరిశోధనలు; వాటి ఉపయోగాలు, అమలు, ప్రయోగాల తీరుతెన్నులు, వ్యయం మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని పునః సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

* వ్యవసాయంపై మరింత దృష్టి సారించాలని సూచించింది. పంట తెగుళ్ల నివారణ, కరవు ప్రాంతాల్లో వ్యవసాయం, అధునాతన వ్యవసాయ పనిముట్ల వాడకం మొదలైన వాటిపై పరిశోధనలు చేయాలని పేర్కొంది. 

* సహజ వనరుల లభ్యత, వాటి వినియోగంపై సర్వే చేయాలని నిర్దేశించారు. 

* శాస్త్ర సాంకేతిక విభాగం (Department of Science and Technolony) ఆధ్వర్యంలో శాస్త్ర సాంకేతికత కోసం జాతీయ సమాచార వ్యవస్థ (National Information System for Science & Technology - NISSAT)ను  ఏర్పాటుచేశారు. దీన్ని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించారు.

ఆరో పంచవర్ష ప్రణాళిక (1980-85)

ఈ కాలంలో శాస్త్రీయ విజ్ఞానం, సాంకేతికత, విద్యారంగాల్లో సాధించిన వృద్ధిని పరస్పరం అనుసంధానించటం ద్వారా మరింత మెరుగైన ఫలితాలను సాధించవచ్చని పేర్కొన్నారు.

నూతన పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేసి శాస్త్ర విజ్ఞానంపై సైద్ధాంతికంగానే కాకుండా ఆచరణాత్మకంగా పరిశోధనలు చేయాలని భావించారు. ప్లాస్మా భౌతికశాస్త్రం (Plasma Physics), రోగనిరోధకశాస్త్రం (Immunology), అనువర్తిత మైక్రోబయాలజీ మొదలైన అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించింది.

* 1983లో ప్రభుత్వం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ ప్రకటించింది.

ఏడో పంచవర్ష ప్రణాళిక (1985-90)

సామాజిక న్యాయం సమానత్వంతో కూడిన అభివృద్ధి (Equity with social justice), స్వయం సమృద్ధి (Self reliance) మొదలైనవాటి ద్వారా మెరుగైన ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు.

* ఉత్పత్తి, ఉద్యోగ అవకాశాలు పెంపొందించడం ద్వారా వేగవంతమైన అభివృద్ధిని సాధించాలని సూచించింది. మైక్రో ఎలక్ట్రానిక్స్, మెటీరియల్‌ సైన్స్, సముద్ర అధ్యయన శాస్త్రం, నూతన జీవశాస్త్రం (Modern Biology), భూ అధ్యయనశాస్త్రం (Earth Sciences), అంతరిక్ష విజ్ఞానశాస్త్రం (Space Science) మీద దృష్టి కేంద్రీకరించాలని ప్రభుత్వం భావించింది.

* శాస్త్ర సాంకేతిక అధ్యయనం, అనువర్తనాలను దేశాభివృద్ధికి అన్వయించే దిశగా భారత ప్రభుత్వం టెక్నాలజీ మిషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

* ఇదే ప్రణాళికా కాలంలో 1986లో CAPART (Council for Advancement of Peoples Action and Rural Technology) అనే గ్రామీణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక (1992-97)

శాస్త్ర సాంకేతికతను సామాజిక, ఆర్థిక రంగాలకు అనుసంధానించాలని భావించారు. 

* కొన్ని ముఖ్య రంగాలను గుర్తించి, వాటి ద్వారా ప్రాథమిక శాస్త్ర విజ్ఞాన (Basic Sciences) పరిశోధనలతో పాటు, వినూత్న ఆవిష్కరణలపై కూడా ప్రయోగాలు చేయాలని నిర్ణయించారు. వీటిని మారుమూల గ్రామాలకు విస్తరింపజేసి కనీస అవసరాలైన తాగునీరు, పోషకాహారం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, నివాసం, శక్తివనరులు, ఉద్యోగిత లాంటి అవసరాలు తీర్చాలని సూచించారు.

తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక (1992-97)

ఇందులో ముఖ్యంగా భారత శాస్త్ర సాంకేతిక రంగం స్వయం సమృద్ధి గురించి ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సాంకేతిక ఉద్యమాన్ని తట్టుకునేలా మనదేశ శాస్త్రీయ రంగాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 

* శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధికి భారత ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు ఫెసిలిటేటర్లుగా వ్యవహరించాలని సూచించింది. 

* శాస్త్ర సాంకేతిక రంగాల దృక్పథం, పరిశోధనా-అభివృద్ధి సంస్థల (R&D Institutions) ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాల వృద్ధి జరిగేలా ప్రణాళికలు లేదా పథకాలు రూపొందించాలని ప్రతిపాదించారు.

* ఈ కాలంలో పర్యావరణ హిత, శుద్ధ శక్తి వనరుల సాంకేతిక ఆవశ్యకతను ఉద్ఘాటించింది. అణుశక్తి, అంతరిక్ష సాంకేతికతల అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకుంది. అణుశక్తి, సముద్ర శాస్త్ర పరిశోధనలను ప్రాముఖ్య రంగాలుగా గుర్తించారు.

పదో పంచవర్ష ప్రణాళిక (1992n-97):

శాస్త్ర సాంకేతిక రంగాల అనువర్తనాలను, పరిశోధనా-అభివృద్ధి రంగాలను బలోపేతం చేయాలని; మానవ వనరుల అభివృద్ధితో పాటు, ఎక్కువ మంది విద్యార్థులు సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశం పొందేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. 

* పదో ప్రణాళిక ముఖ్య లక్ష్యం భారత టెక్నాలజీలపై దృష్టి కేంద్రీకరించటం. జాతీయ అభివృద్ధి కోసం సంప్రదాయ-ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని నిర్దేశించారు.

* విశ్వవిద్యాలయాల్లో బేసిక్‌ సైన్స్‌పై మరిన్ని పరిశోధనలు జరిగేలా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు. సమాచార భావ ప్రసార సాంకేతికతను, జీవసాంకేతిక శాస్త్రాలను వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉపయోగించాలని సూచించారు. 

* Science and Technology Policy 2003 (STP2003)ని ప్రతిపాదించారు. దీని ద్వారా పరిశోధనా-అభివృద్ధి, మేధోసంపత్తి హక్కులు sIntellectual Property Rightsz, విపత్తు నిర్వహణలను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.

భారతీయుల ఆవిష్కరణలు

క్రీ.పూ.రెండో సహ్రసాబ్ది (millennium) నాటికే భారతీయులు ఇనుము వాడారు. గంగాలోయ ప్రాంత ప్రజలు దీన్ని విరివిగా ఉపయోగించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.

* స్టీల్‌ వస్తువులకు తుప్పు పట్టకండా పూసే పూతను మనవారే కనిపెట్టారు. ఈ పద్ధతి చాలా కాలం ఇతర దేశాలకు తెలియదు. 

* స్వేదన ప్రక్రియ ద్వారా జింక్‌ను శుద్ధి చేశారు. లోహశాస్త్ర ప్రయోగాలకు ఇది ఎంతగానో తోడ్పడింది.

* హరప్పా నాగరికతను ప్రపంచవ్యాప్తంగా అధునాతన ప్రాచీన నాగరికతగా చరిత్రకారులు పేర్కొంటారు. నీటిని నిల్వ చేసే చెరువులు, డ్యాంల నిర్మాణం; డ్రైనేజీ వ్యవస్థ; బహుళ అంతస్థుల భవనాలు మొదలైనవి వీరి నిర్మాణ ప్రతిభను తెలుపుతున్నాయి.

* భారతీయ వస్త్రాలకు వివిధ దేశాల్లో విపరీతమైన ఆదరణ ఉండేది. అక్కడ వీటిని నాణ్యమైనవిగా, మన్నిక కలిగిన వాటిగా పరిగణించేవారు. వస్త్ర వ్యాపారం రోమన్‌ దేశాలతో ఎక్కువగా జరిగేది. బ్రిటిష్‌ వారు ముందుగా భారత్‌ నుంచి వస్త్ర పరిశ్రమను ఇంగ్లండ్‌కు తరలించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 

* నౌకాయానంలో దిక్సూచిని వాడటం భారత్‌లోనే ప్రారంభమైది. తర్వాతే దీన్ని యూరోపియన్లు కనుక్కున్నారని చరిత్రకారులు విశ్లేషించారు. 

* ఆయుర్వేదం భారత్‌లోనే ఆవిర్భవించింది. ఇది క్రీ.పూ. 5వ శతాబ్దం నాటికి సంపూర్ణ శాస్త్రంగా రూపొందిందని ఆయుర్వేద పండితుల అభిప్రాయం.

* మిశ్రమ వ్యవసాయం, పంట మార్పిడి, నేల ఆధారంగా పంట ఎంపిక, జీవ ఆధారిత ఎరువులు, పురుగు మందుల వాడకం మొదలైనవన్నీ మనదేశం నుంచే మొదలయ్యాయి.

* సున్నా, దశాంశ పద్ధతి భారత్‌లోనే ఆవిర్భవించాయి. మన వేద గణితాన్ని (vedic maths) ఇప్పటికీ పాశ్చాత్యులు నేర్చుకుంటునే ఉన్నారు.

పన్నెండో పంచవర్ష ప్రణాళిక (2012-17)


*  జీడీపీలో పరిశోధనా-అభివృద్ధి రంగం నుంచి వచ్చే వాటాను 1% నుంచి 2 శాతానికి పెంచారు. ఈ కాలంలో సైన్స్‌ రంగాన్ని బలోపేతం చేసి మరిన్ని లక్ష్యాలు సాధించాలని పేర్కొన్నారు. అవి:


* విద్యావ్యవస్థ, ఉద్యోగాల కల్పన, మానవ వనరుల అభివృద్ధిలో పోటీ పెంచి నాలెడ్జ్‌ ఎకానమీ సాధించడం.


* ఎస్‌ అండ్‌ టీ ఆధారిత జ్ఞానాన్ని దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఉపయోగించడం.


* వ్యూహాత్మక పరిశోధనలు చేపట్టి  జాతీయ, అంతర్జాతీయ అవసరాలకు  ఉపయోగించడం. నూతన ఆవిష్కరణలకు కృషి చేయడం.


* శాస్త్ర సాంకేతిక రంగాల ప్రాజెక్టులు, నూతన పథకాల్లో PPP (Public Private Partnership)  ప్రభుత్వంతో పాటు ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, పరిశోధనా సంస్థలు, ఉన్నత సైన్స్‌ సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో శాస్త్ర సాంకేతిక రంగాల ఆవిష్కరణలు జరిగేలా చేయడం, సైన్స్‌ పరిశోధనల్లో భారత్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం  ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశాలు. ఎస్‌ అండ్‌ టీ అభివృద్ధిలో  నీతి ఆయోగ్‌ 2015లో ప్రణాళికా సంఘం స్థానంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా (నీతి ఆయోగ్‌)ను ఏర్పాటు చేశారు. ఇది సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పథకాలను రూపొందించింది. అవి:

i) Atal Innovation Mission (AIM) 

ii) Digital India Programme 

iii) Make In India 

* శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి నీతి ఆయోగ్‌ దేశంలోని వివిధ పరిశోధనా సంస్థలకు  కావాల్సిన వనరులను, ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇది ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించి, సామర్థ్య నిర్మాణంపై దృష్టిసారించింది.

* నీతి ఆయోగ్‌ ముఖ్య లక్ష్యం సహకార సమాఖ్య (‘్న్న్ప’౯్చ్మi్ర’ ÷’్ట’౯్చ్మi్న-). దీని సాధన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలకు కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చి అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోంది.

* రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య విజ్ఞానశాస్త్రపరంగా పోటీతత్వాన్ని పెంచడం కోసం ఏటా (cooperative federation) ను  ప్రచురించి ర్యాంకులు ప్రకటిస్తోంది.

* వీటి ఫలితంగానే ఎస్‌ అండ్‌ టీ రంగంలో భారత్‌ పురోగతిని సాధించింది.  గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ ఏటా ప్రకటించే ర్యాంకుల్లో 2020లో భారత్‌ 48వ స్థానంలో ఉండగా, 2021 నాటికి 46కి చేరింది. 2015లో ఈ ర్యాంక్‌ 81గా ఉంది.

మాదిరి ప్రశ్నలు

1. ‘సైన్షియా’ (scientia) అనే పదం ఏ భాష నుంచి ఆవిర్భవించింది?

1) గ్రీకు            2) లాటిన్‌ 

3) అరబిక్‌        4) ఇంగ్లిష్‌

2. ‘టెక్నొలోజియా’ (Tehnologia) అనే పదం ఏ భాష నుంచి ఆవిర్భవించింది?

1) గ్రీకు             2) లాటిన్‌ 

3) అరబిక్‌        4) ఇంగ్లిష్‌

3. భారతీయులు కనుక్కున్న అరబిక్‌ సంఖ్యలను అరబ్బులు ఏమని పిలిచారు?

1) సంఖ్యా         2) హింద్‌సా 

3) నంబర్లు         4) అంక్‌

4. ఆల్జీబ్రాను మొదటిసారిగా భాస్కర ఖిఖి ఏ గ్రంథంలో ప్రస్తావించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు?

1) సిద్ధాంత శిరోమణి 

2) పంచ సిద్ధాంతం 

3) సూర్య సిద్ధాంతం       4) చరక సంహిత

5. కింది అంశాలను జతపరచండి.

i) ఆర్యభట్ట            a) చరక సంహిత

ii) భాస్కర ఖిఖి     b) సుశ్రుత సంహిత

iii) సుశ్రుత           c) బీజగణితం (ఆల్జీబ్రా)

iv) చరక               d) విలువ 


1) i-c, ii-b, iii-a, iv-d 
2) i-d, ii-c, iii-b, iv-a 
3) i-a, ii-b, iii-c, iv-d 
4) i-b, ii-d, iii-a, iv-c 

6. ప్రాచీన భారతీయ వైద్య భాండాగారం అని దేన్ని పిలుస్తారు?

1) రుగ్వేదం     2) సామవేదం 

3) యజుర్వేదం     4) అధర్వణవేదం

7. విజ్ఞాన శాస్త్ర పరిశోధనల కోసం 1784లో సర్‌ విలియం జోన్స్‌ స్థాపించిన సొసైటీ?

1) ఏసియాటిక్‌ సొసైటీ 

2) బెంగాల్‌ సొసైటీ  

3) కలకత్తా సొసైటీ 

4) ఇండియన్‌ సొసైటీ


8. 1851లో ‘థామస్‌ ఓల్డ్‌హోమ్‌’ నేతృత్వంలో ఏర్పాటైన సంస్థ?

1) బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా

2) జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా

3) జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా

4) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌

9. 1890లో డాక్టర్‌ విలియం రాక్స్‌ బర్గీ  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంస్థ? 

1) జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ)

2) బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (బీఎస్‌ఐ)

3) జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జడ్‌ఎస్‌ఐ)

4) కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)


10. జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాను ఏ సంవత్సరంలో, ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేశారు?

1) 1851, సర్‌ ఓల్డ్‌ హోమ్‌

2) 1860, విలియం రాక్స్‌ బర్గీ

3) 1916, జాన్‌ అండర్సన్‌

4) 1784, సర్‌ విలియం జోన్స్‌

11. ప్రస్తుతం దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల పరిశోధనకు కృషి చేస్తున్న సంస్థ?  (దీన్ని మొదట పారిశ్రామిక అవసరాల కోసం స్థాపించారు. ఇది 1942 సెప్టెంబరు 26 నుంచి స్వయం నియంత్రిత సంస్థగా పనిచేస్తోంది.)

1) టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌)

2) కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)

3) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌)

4) విక్రం సారాబాయి స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌ఆర్‌)


12. మొదటి సైంటిఫిక్‌ పాలసీని ఏ పంచవర్ష ప్రణాళికలో రూపొందించారు? (భారత మొదటి ప్రధాని నెహ్రూ, హోమీ.జె.బాబా ఆధ్వర్యంలో ఇది జరిగింది.)

1) మొదటి పంచవర్ష ప్రణాళిక

2) రెండో పంచవర్ష ప్రణాళిక

3) మూడో పంచవర్ష ప్రణాళిక

4) నాలుగో పంచవర్ష ప్రణాళిక

13. National Information System for Science & Technology (NISSAT)  ను ఏ ప్రణాళికా కాలంలో ఏర్పాటు చేశారు?

1) నాలుగు        2) అయిదు 

3) ఆరు             4) ఏడు

14. కింది అంశాలను జతపరచండి.

i) చరకుడు                 a) సుల్వ సూత్రాలు

ii) పతంజలి                b) చరక సంహిత

iii) సుశ్రుతుడు               c) యోగా

iv) వరాహమిహిరుడు          d) సుశ్రుత సంహిత

v) బుదయనడు               e) బృహత్‌ సంహిత


1) i-b, ii-c, iii-d, iv-e, v-a 

2) i-a, ii-c, iii-b, iv-d, v-e 

3) i-e, ii-b, iii-a, iv-d, v-c

4) i-b, ii-a, iii-e, iv-c, v-d

15.  Council for Advancement of People’s Action on Rural Technology (CAPART)  ఏర్పాటుకు  ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఆమోదం తెలిపారు?

1) అయిదు        2) ఆరు  

3) ఏడు         4) ఎనిమిది

16. టెక్నాలజీ మిషన్లు ఏ ప్రణాళికా కాలంలో ఏర్పాటయ్యాయి? (శాస్త్ర సాంకేతిక రంగ అధ్యయనాలు, అనువర్తనాలను దేశాభివృద్ధికి సమగ్రంగా ఉపయోగించాలని భారత ప్రభుత్వం వీటిని ప్రారంభించింది.

1) ఏడు         2) ఎనిమిది  

3) తొమ్మిది         4) పది

17. భారతీయ టెక్నాలజీలు (Indigenous Technologies) సంప్రదాయ విజ్ఞాన శాస్త్రాలకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రజల జీవనస్థాయిని పెంచి,  పర్యావరణ హిత సమాజాన్ని స్థాపించాలని ఏ ప్రణాళికలో ప్రాముఖ్యంగా  ప్రస్తావించారు?

1) తొమ్మిది        2) పది  

3) పదకొండు         4) పన్నెండు

18. ‘‘మనదేశంలో శాస్త్రసాంకేతిక రంగాలు  ఆశించిన స్థాయిలో అభివృద్ధి కాకపోవడానికి కారణం వాటిలో అతి తక్కువ  పెట్టుబడి పెట్టడమే’’ అని ఏ ప్రణాళికా డాక్యుమెంట్‌లో ప్రస్తావించారు?

1) తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక       

2) పదో పంచవర్ష ప్రణాళిక    

3) పదకొండో పంచవర్ష ప్రణాళిక       

4) పన్నెండో పంచవర్ష ప్రణాళిక

19. ఖివిళీశిఖిళిని INSPIRE (Innovation In Science Pursuit for Inspired Research)   ప్రోగ్రాం దేని ఆధ్వర్యంలో పనిచేస్తుంది?

1) యువజన మంత్రిత్వ శాఖ 

2) అంతరిక్ష విభాగం

3) సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం 

4) అణు ఇంధన విభాగం

20. గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ 2021లో భారత్‌ ఎన్నో స్థానంలో ఉంది?

1) 46   2) 48   3) 52   4) 50

సమాధానాలు


1 - 2  2 - 1  3 - 2  4 - 1  5 - 2  6 - 4  7 - 1  8 - 2  9 - 2  10 - 3  11 - 2  12 - 2  13 - 2  14 - 1  15 - 3  16 - 1  17 - 2  18 - 3  19 - 3 20 - 1


రచయిత: రేమల్లి సౌజన్య, విషయ నిపుణులు 

Posted Date : 04-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌