• facebook
  • whatsapp
  • telegram

ఆగస్టు 1న నీట్‌-2021

ప్ర‌క‌టించిన నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ

11 భాష‌ల్లో ఆఫ్‌లైన్‌లో ప‌రీక్ష‌

ఈనాడు, దిల్లీ: నీట్‌ యూజీ-2021 పరీక్షను ఆగస్టు 1వ తేదీన‌ నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది. ఈ మేరకు మార్చి 12న‌ ప్రకటన విడుదల చేసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఏఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆయా కోర్సులను నియంత్రించే సంస్థలు జారీచేసిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించనున్నారు.  హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 11 భాషల్లో పెన్‌ అండ్‌ పేపర్‌ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్ష ఫలితాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఇతర సంస్థలు (ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌/నర్సింగ్‌ కాలేజీలు/స్కూళ్లు, జిప్‌మర్‌) అవసరమైన కోర్సుల కౌన్సెలింగ్‌/అడ్మిషన్ల కోసం (బీఎస్సీ నర్సింగ్‌, బీఎస్సీ లైఫ్‌సైన్సెస్‌తో సహా) ఉపయోగించుకోవచ్చని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తెలిపింది. పరీక్షకు సంబంధించిన సిలబస్‌, అర్హత ప్రమాణాలు, వయసు, రిజర్వేషన్‌, సీట్ల వర్గీకరణ, పరీక్ష ఫీజు, నిర్వహించే కేంద్రాలు, స్టేట్‌ కోడ్‌, ఎప్పటిలోపు దరఖాస్తు చేసుకోవాలి వంటి అన్ని వివరాలను  త్వరలో ఎన్‌టీఏనీట్‌ వెబ్‌సైట్‌లో ప్రకటించనున్నారు. నీట్‌కు హాజరుకావాలనుకొనే విద్యార్థులంతా nta.ac.in, ntaneet.nic.in వెబ్‌సైట్లను గమనిస్తూ ఉండాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సూచించింది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.