* సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున
ఈనాడు డిజిటల్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో చదువులు, క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రోత్సహించేందుకు తరగతుల వారీగా పతకాలు అందించనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. వచ్చే జనవరి నుంచి వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందిస్తామని ప్రకటించారు. సచివాలయంలో ఆయన నవంబరు 25న అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘గురుకులాల్లో ఉండే విద్యార్థుల్లో 5 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సాధారణ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా, 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు వారంతపు పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా పతకాలు అందిస్తాం. విద్య, క్రీడల్లో ప్రతి తరగతికీ ముగ్గురు చొప్పున అందిస్తాం. అకడమిక్స్లో గోల్డ్ స్టార్, సిల్వర్ స్టార్, బ్రౌంజ్ స్టార్ పతకాలు అందిస్తాం...’ అని మంత్రి నాగార్జున వివరించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.