ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మహాత్మా జ్యోతిబాపులె బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని వనపర్తి, కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాలల్లో బీఎస్సీ అగ్రికల్చర్ (ఆనర్స్) కోర్సులు మంజూరయ్యాయి. ఒక్కో కళాశాలకు 120 సీట్ల చొప్పున 240 సీట్లలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి బీసీ గురుకుల సొసైటీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కోర్సులో చేరేందుకు ఆసక్తి కలిగిన మహిళలు డిసెంబరు 5 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు తెలిపారు. ఎంసెట్-22 ప్రవేశపరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా రిజర్వేషన్లకు అనుగుణంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు తప్పనిసరి కళాశాల వసతి గృహాల్లోనే ఉండాలన్నారు. తల్లిదండ్రుల వార్షికాదాయం ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదని వివరించారు. ఆన్లైన్ దరఖాస్తులు పూర్తయ్యాక డిసెంబరు 10న మెరిట్లిస్టు ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీ అభ్యర్థులకు మూడేళ్ల ప్రణాళిక!
‣ పవర్ గ్రిడ్లో కొలువు కావాలా?
‣ ఉన్నాయా మీకు ఈ ఉద్యోగ లక్షణాలు?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.