ఈనాడు, హైదరాబాద్: మహబూబాబాద్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నెలకొల్పనున్న ఇంజినీరింగ్ కళాశాలలపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిపుణుల కమిటీని నియమించింది. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో కొత్తగా ఇంజినీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం (2023-24) నుంచే తరగతులు ప్రారంభిస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటితోపాటు కొత్తగూడెంలో కాకతీయ విశ్వవిద్యాలయం కింద పనిచేస్తున్న ఇంజినీరింగ్ కళాశాలలో హాస్టళ్లు, ఇతర వసతులు కల్పించి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని కూడా సీఎం ప్రకటించారు. ఈక్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఒక్కో కళాశాల కోసం ఒక్కో నిపుణుల కమిటీని ఉన్నత విద్యామండలి నియమించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.