• facebook
  • whatsapp
  • telegram

Engineering Colleges: కొత్త ఇంజినీరింగ్‌ కళాశాలలపై నిపుణుల కమిటీల నియామకం

ఈనాడు, హైదరాబాద్‌: మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో జేఎన్‌టీయూహెచ్‌ ఆధ్వర్యంలో నెలకొల్పనున్న ఇంజినీరింగ్‌ కళాశాలలపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిపుణుల కమిటీని నియమించింది. మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో కొత్తగా ఇంజినీరింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేస్తామని, వచ్చే  విద్యా సంవత్సరం (2023-24) నుంచే తరగతులు ప్రారంభిస్తామని ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటితోపాటు కొత్తగూడెంలో కాకతీయ విశ్వవిద్యాలయం కింద పనిచేస్తున్న ఇంజినీరింగ్‌ కళాశాలలో హాస్టళ్లు, ఇతర వసతులు కల్పించి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని కూడా సీఎం ప్రకటించారు. ఈక్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఒక్కో కళాశాల కోసం ఒక్కో  నిపుణుల కమిటీని ఉన్నత విద్యామండలి నియమించింది.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎల్ఐసీలో ఏఏఓ కొలువులు

‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!

‣ నవతరం బాలలకు నవోదయ స్వాగతం

‣ ఇష్టపడి చదివితే చాలు!

‣ మళ్లీ మళ్లీ చదవండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.