ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా తరగతి గది ఆధారిత అంచనా-2(సీబీఏ) పరీక్షలు ఫిబ్రవరి 7 నుంచి పదో తేదీ వరకు జరగనున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్లోని 1-5 తరగతులకు జిల్లా పరీక్షల విభాగం ప్రశ్నపత్రాలను అందిస్తుంది. 6-10 తరగతులకు సంబంధించిన అన్ని రకాల పాఠశాలలకు ప్రశ్నపత్రాలు అందిస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్ బడుల్లో 1-8 తరగతులకు ఓమ్మార్షీట్తో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రాలను 12వ తేదీలోపు మూల్యాంకనం పూర్తి చేసి, 14లోపు ఆన్లైన్లో మార్కులను నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రాలను ఉపాధ్యాయులే మండల కేంద్రాలకు వెళ్లి తెచ్చుకోవాలనే నిబంధన పెట్టారు. ఉపాధ్యాయులు ఉదయాన్నే పాఠశాలకు వచ్చి, ముఖ గుర్తింపు ఆధారిత హాజరు వేసుకొని, మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నపత్రాలను పాఠశాలలకు అందించాలని కోరుతున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డెకరేషన్లకు కొన్ని కోర్సులు!
‣ వేదికపై ధీమాగా... నలుగురూ మెచ్చేలా!
‣ నిర్మాణ రంగంలో కొన్ని కోర్సులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.