ఈనాడు, అమరావతి: అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం, యూఎస్ కాన్సులేట్ నిర్ణయించినట్లు డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. యూఎస్ కాన్సులేట్ చీఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారి ఆధ్వర్యంలోని బృందం నవంబరు 29న డీజీపిని కలిసింది. పాస్పోర్టు, వీసా మోసాలు, మానవ అక్రమ రవాణా తదితర సమస్యలపై ఈ సందర్భంగా చర్చించినట్లు డీజీపీ వివరించారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం పలువురు విద్యార్థులు నకిలీ ధ్రువీకరణ పత్రాలను సమర్పిస్తూ పట్టుబడ్డారని, ఈ విషయమై రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించామన్నారు. విశ్వవిద్యాలయాలకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పంపే సమయంలో విద్యార్థులు కొంత రుసుముగా చెల్లించాల్సి వస్తోందని, దీనివల్ల వారిపై అదనపు భారం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని మాఫీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
‣ ఒకేసారి గ్రూప్స్ అన్ని నోటిఫికేషన్లు వస్తే ఏంచేయాలి?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.