ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో పోస్టుల హేతుబద్ధీకరణపై అయోమయం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 14 విశ్వవిద్యాలయాలు ఉంటే ఇందులో ఏడు విశ్వవిద్యాలయాలు ఇప్పటికే రెండోసారి హేతుబద్ధీకరణ చేశాయి. విభాగాలను విలీనం చేస్తున్న వర్సిటీలు ఏ సబ్జెక్టుకు ఎన్ని పోస్టులను కేటాయించిందో చూపడం లేదు. మరోపక్క ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తారు? అనే దానిపైనా స్పష్టత లేదు. హేతుబద్ధీకరణలో భాగంగా కొన్ని వర్సిటీల్లో పోస్టులను రద్దు చేసి, వాటిని ఇతర వర్సిటీలకు సర్దుబాటు చేశారు. కొన్ని సబ్జెక్టులను ఇతర విభాగాల్లో విలీనం చేశారు. అన్ని వర్సిటీలకు కలిపి 3,480 పోస్టులు ఉండగా.. వీటిలో ఎలాంటి మార్పు లేకుండా పోస్టుల హేతుబద్ధీకరణ, సర్దుబాటు చేశారు. ఈ పోస్టుల్లో పని చేస్తున్న వారిని మినహాయించి, ఖాళీలకు ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం మాత్రం హేతుబద్ధీకరణ పోస్టులను ప్రకటించిందే తప్ప, ఖాళీలు ఎన్ని ఉన్నాయో? అనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదు. మరోపక్క విశ్వవిద్యాలయాలు సెప్టెంబరు 22లోపు ప్రకటనలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఖాళీలను ప్రభుత్వం ప్రకటించనందున నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. సాధారణంగా హేతుబద్ధీకరణ చేసినప్పుడే ఆయా వర్సిటీల్లో అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి? పని చేస్తున్న వారు ఎంతమంది? ఖాళీలు ఎన్ని ఉన్నాయో ప్రకటిస్తారు? కానీ, ఈ ప్రభుత్వం మాత్రం కేవలం హేతుబద్ధీకరణ పోస్టులను మాత్రమే ప్రకటించి, ఖాళీలను దాచేస్తోంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సమంగా ఇచ్చి.. సమష్టిగా పంచుకొని!
‣ కోస్ట్గార్డ్లో 350 కొలువులు
‣ పీఓ కొలువుల ప్రిపరేషన్ ప్లాన్
‣ లెఫ్టినెంట్ హోదాలో మహిళామణులు
‣ అకడమిక్ యాంగ్జైటీని అధిగమిద్దాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.