• facebook
  • whatsapp
  • telegram

BEd: బీఈడీలో 10వేల సీట్లకు కోత

 

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీలో 10వేల సీట్లకు ఉన్నత విద్యాశాఖ కోత విధించింది. గతేడాది నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 34,760 సీట్లు ఉండగా.. ఇప్పుడు 23,970కి తగ్గించింది. బీఈడీ కౌన్సెలింగ్‌ జ‌న‌వ‌రి 25న‌ నుంచి ప్రారంభం కావడంతో కళాశాలలు, సీట్ల జాబితాను ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో పెట్టింది. కళాశాలల్లో అర్హత కలిగిన అధ్యాపకులు, సౌకర్యాలు లేకపోవడంతో ఈ కోత విధించినట్లు అధికారులు తెలిపారు. గతేడాది 411 కళాశాలలు కౌన్సెలింగ్‌లో ఉండగా.. ఈసారి 291 మాత్రమే ఉన్నాయి. ఒక్క నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోనే 48 కళాశాలలకు అనుమతులు నిలిపివేశారు. అత్యధికంగా బీఈడీ కళాశాలలు ఈ వర్సిటీ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 411 కళాశాలలు ఉంటే ఈ ఒక్క వర్సిటీ పరిధిలోనే 175 కళాశాలలు ఉన్నాయి. అధ్యాపకులు రెండు, మూడు కళాశాలల్లో పని చేస్తున్నారనే కారణంతోనే ఎక్కువ కళాశాలలకు అనుమతులు నిలిపివేశారు. ఆన్‌లైన్‌లో అధ్యాపకుల వివరాలు తప్పుగా నమోదు కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. దీనిపై విశ్వవిద్యాలయాలకు మరోసారి వివరాలు సమర్పిస్తున్నాయి. వీటిని రెండో విడత కౌన్సెలింగ్‌లో పెట్టేందుకు అనుమతించాలని కోరుతున్నాయి. మరికొన్ని కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడం, ప్రైవేటులో జీతాలు తక్కువగా ఉండడంతో ఏటా బీఈడీలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. కన్వీనర్‌ కోటా సీట్లలో 30శాతం కూడా నిండడం లేదు.  చాలా కళాశాలలు ఇతర రాష్ట్రాల విద్యార్థులతోనే కొనసాగుతున్నాయి.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ నీట్‌లో మేటిస్కోరుకు మెలకువలు!

‣ బీఆర్‌ఓలో 567 ఉద్యోగాలు

‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!

‣ నేర్పిస్తే మనకే మంచిది!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.