ఎస్కేయూ(అనంతపురం), న్యూస్టుడే: అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని న్యాయశాస్త్ర విభాగంలో మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సును కొనసాగిస్తామని ఉపకులపతి ఆచార్య రామకృష్ణారెడ్డి డిసెంబరు 7న ప్రకటించారు. వర్సిటీలో 52 ఏళ్ల నుంచి న్యాయశాస్త్రం కోర్సులు నిర్వహిస్తున్నారు. విశ్వ విద్యాలయ సమస్యలపై న్యాయశాస్త్ర విద్యార్థులు ప్రశ్నిస్తున్నారన్న ఉద్దేశంతో ఏకంగా మూడేళ్ల లా కోర్సులో ప్రవేశాలను నిలిపేయాలని ఉన్నత విద్యామండలికి లేఖ రాశారు. ఇదే విషయంపై ‘ఎస్కేయూలో న్యాయశాస్త్ర కోర్సుకు మంగళం’, ‘మసకబారుతున్న 52 ఏళ్ల చరిత్ర’ శీర్షికలతో డిసెంబరు 6న ‘ఈనాడు’లో కథనాలు ప్రచురితమయ్యాయి. కోర్సును కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రికి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖలు రాశారు. ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్ఏ, ఎస్ఎఫ్ఐల నాయకులూ ఆందోళన చేశారు. దాంతో... లా కోర్సును కొనసాగిస్తామని, ఈ మేరకు ఉన్నత విద్యామండలికి లేఖ రాస్తామని ఉపకులపతి తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.