• facebook
  • whatsapp
  • telegram

Degree: అద్దె భవనాల్లోని డిగ్రీ కళాశాలలకు అనుమతులు పొడిగింపు


 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పదేళ్లకు పైబడి అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు ఒకేసారి మూడేళ్ల వరకు అనుమతులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది వరకు ఒక సంవత్సరం చొప్పున మాత్రమే అనుమతులు పొడిగిస్తూ వచ్చింది. నిబంధనల ప్రకారం ఏటా అనుమతులు ఇవ్వడంపై నిర్ణయం తీసుకోవాలని ఉన్నత విద్యా మండలిని ఆదేశించింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రైవేటు డిగ్రీ కళాశాలలన్నీ 2025 డిసెంబరు 31లోపు సొంత భవనాల్లోకి మారేందుకు నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,046 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉండగా.. 413 కళాశాలలు పదేళ్లకు పైనుంచి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం అనుమతులు పొందినప్పటి నుంచి పదేళ్లలోపు శాశ్వత భవనాల్లోకి మారాలి. లేకపోతే వాటిని మూసేయాలి. అలా చేస్తే విద్యార్థులకు సీట్ల సమస్య ఏర్పడుతుందని ఏటా అనుమతులు ఇస్తోంది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.