• facebook
  • whatsapp
  • telegram

Diploma Courses: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో డిప్లొమా కోర్సులు

 

ఈనాడు, హైదరాబాద్‌: పట్టభద్రులకు మరింత ప్రయోజనం కల్పించడం కోసం కేంద్రీయ విశ్వవిద్యాలయం సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్, వర్చువల్‌ లెర్నింగ్‌ ద్వారా ఒక సంవత్సరం డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టింది. సమ్మిళిత పద్ధతిలో భాగంగా వీటిని విద్యార్థులకు అందించనున్నామని, పీజీ స్థాయిలో ఇవి వారికి ఉపకరిస్తాయని హెచ్‌సీయూ అధికారులు ఫిబ్రవరి 3న ప్రకటనలో తెలిపారు. బిజినెస్‌ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, సైబర్‌ చట్టాలు, ఫోరెన్సిక్‌ శాస్త్రం, లైబ్రరీ ఆటోమేషన్, నెట్‌వర్కింగ్, కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్, కమ్యూనిటీ ఐ హెల్త్‌ వంటి కోర్సుల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నామని వివరించారు. విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ కోర్సుల వివరాలున్నాయని, మరిన్ని వివరాలకు 040-2460 0264, 040-2460 0265 నంబర్లకు ఫోన్‌ చేయాలని, దరఖాస్తులు సమర్పించేందుకు మార్చి 13 వరకు గడువని తెలిపారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ నవతరం బాలలకు నవోదయ స్వాగతం

‣ మళ్లీ మళ్లీ చదవండి!

‣ చెత్తను వదిలించే చక్కటి ఉద్యోగం!

‣ గ్రూప్‌-2కి సమగ్ర సన్నద్ధత ఎలా?

‣ రివిజన్‌..ప్రాక్టీస్‌.. సక్సెస్‌ సూత్రాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.