ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో వైద్య విద్య డైరెక్టరేట్ పరిధిలో వైద్యవిద్య డైరెక్టర్ (డీఎంఈ) సహా మొత్తం ఎనిమిది పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యఆరోగ్యశాఖ ప్రతిపాదనల మేరకు ఈ పోస్టులను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యవిద్య డైరెక్టర్ (డీఎంఈ), వైద్యవిద్య డైరెక్టర్ (అకడమిక్), వైద్య విద్య అదనపు డైరెక్టర్, అదనపు డైరెక్టర్ (అడ్మిన్), జాయింట్ డైరెక్టర్ అడ్మిన్, జాయింట్ డైరెక్టర్ (మెడికల్), డిప్యూటీ డైరెక్టర్ (నర్సింగ్), అసిస్టెంట్ డైరెక్టర్ (నర్సింగ్) పోస్టులను మంజూరుచేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకూ వైద్యవిద్య డైరెక్టర్ (డీఎంఈ) పోస్టు లేదు. తాజా ఉత్తర్వులతో ఆ పోస్టును మంజూరు చేసినట్లయింది. ప్రస్తుతం వైద్య విద్య డైరెక్టర్ (ఇన్ఛార్జి)గా కె.రమేష్రెడ్డి వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలల ఏర్పాటు, వైద్యవిద్యకు ప్రాధాన్యం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్ల తర్వాత వైద్య విద్య విభాగానికి సంచాలకులు, ఉప సంచాలకులు సహా ఇతర పోస్టులను మంజూరు చేయడం పట్ల తెలంగాణ టీచింగ్ వైద్యుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, అన్వర్, జలగం తిరుపతిరావు, కిరణ్ మాదాల శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భవిష్యత్తు శాస్త్రవేత్తలకు, ప్రొఫెసర్లకు నెట్!
‣ కాలుష్య నియంత్రణ బోర్డులో కొలువులు
‣ అమెరికాలో అడ్వాన్స్డ్ కోర్సులు ఇవే!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.