• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ మెయిన్‌లో ముగ్గురు తెలుగు విద్యార్థుల‌కు 100 పర్సంటైల్‌ 

దేశ‌వ్యాప్తంగా స్కోర్ సాధించిన వారిలో 13 మంది మ‌న‌వారే


‌ 

ఈనాడు - హైదరాబాద్: జేఈఈ మెయిన్‌ మార్చి రెండో విడతలో తెలంగాణ విద్యార్థులు ముగ్గురు 100 పర్సంటైల్‌ స్కోర్‌ సాధించి సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 13 మందికి 100 పర్సంటైల్‌ దక్కింది. మార్చి 16 నుంచి 18వ తేదీ వరకు రోజుకు రెండు సార్లు చొప్పున జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు జరిగాయి. వాటి స్కోర్‌ను జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) మార్చి 24న‌ వెల్లడించింది. తెలంగాణకు చెందిన బన్నూర్‌ రోహిత్‌కుమార్‌రెడ్డి, మాదుర్‌ ఆదర్శ్‌రెడ్డి, జోస్యుల వెంకట ఆదిత్య 100 పర్సంటైల్‌ సాధించారు. రాజస్థాన్‌కు చెందిన వారు కూడా ముగ్గురు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనుమోలు వినాయక్‌ ఖన్నా 99.997869 పర్సంటైల్‌తో ఆ రాష్ట్ర టాపర్‌గా నిలిచాడు.

తెలుగు విద్యార్థుల్లో కేటగిరీలవారీగా టాపర్లు

 ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో అయిదుగురు టాపర్లు తెలుగు విద్యార్థులే కావడం విశేషం. వారు గుంతపల్లి ఆశిష్‌ సాయి, సోము హితేష్‌ (ఏపీ), మన్నెం చరణ్‌ (తెలంగాణ), కరణం లోకేశ్‌ (ఏపీ), గంగిశెట్టి కృష్ణ సాయి కుషాల్‌ (తెలంగాణ)

‣ ఓబీసీ విభాగంలో: టి.తులసీరామ్‌ (2వ స్థానం, తెలంగాణ),  బీవీఎస్‌ సాయి ప్రబంధ్‌   ( 3వ స్థానం, ఏపీ), బిత్ర సాయిసిద్ధి రఘురామ్‌ శరణ్‌ (5వ స్థానం, ఏపీ)

‣ ఎస్‌సీ విభాగంలో: జానపాటి వర్షితాదేవి (1వ స్థానం,ఏపీ), కె.వివేక్‌ (3వ స్థానం, ఏపీ)

‣ ఎస్‌టీ విభాగంలో:  ఇస్లావత్‌ నితిన్‌, నేనావత్‌ ప్రీతమ్‌, బిజిలి ప్రచోదన్‌ వర్మ, ఎం.రిషినాయక్‌...(వరుసగా వీరికి 1, 2, 3, 4 స్థానాలు)

‣ దివ్యాంగుల విభాగంలో: మల్లుకుంట్ల భానురంజన్‌రెడ్డి (1వ స్థానం, తెలంగాణ),  ఇప్పిలి తాశ్విన్‌, తల్లడ వీరభద్ర నాగసాయి కృష్ణ...ఏపీకి చెందిన వీరిద్దరికి 3, 5 స్థానాలు.

‣ అమ్మాయిల విభాగంలో: దొంతిరెడ్డి హన్వితారెడ్డి (3వ, తెలంగాణ), టి.అమృతవర్షిణి (6వ, ఏపీ), పల్లె భావన (10వ, తెలంగాణ)

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.