• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ మెయిన్‌ తర్వాతే ఇంటర్‌ ప్రాక్టిక‌ల్స్‌!

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రయోగ పరీక్షలను మేలో జరిగే జేఈఈ మెయిన్‌ చివరి విడత పరీక్షల తర్వాత నిర్వహించాలని ఇంటర్‌బోర్డు యోచిస్తోంది. దేశవ్యాప్తంగా మే 24-28 తేదీల మధ్య మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలున్నాయి. ఇంతకుముందు ఇంటర్‌బోర్డు ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్‌, మే 1 నుంచి 17 వరకు వార్షిక పరీక్షలు జరగాలి. ప్రస్తుతం కళాశాలలను మూసివేసినందున ప్రయోగ పరీక్షలను ప్రారంభించడం సాధ్యం కాదు. ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ప్రారంభించాలన్న ప్రతిపాదన ఉన్నా దానికీ అవకాశం లేదని భావిస్తున్నారు. జేఈఈ మెయిన్‌ పరీక్షల తర్వాత ప్రాక్టికల్స్‌ జరపాలన్న ప్రతిపాదనను ఇంటర్‌బోర్డు ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని, రెండు మూడు రోజుల్లో విద్యార్థులకు స్పష్టత ఇస్తామని అధికారులు చెబుతున్నారు.
 

జరిమానా చెల్లించండి... మార్పులు చేసుకోండి

ఇంటర్‌ విద్యార్థులు ఇప్పటికే సమర్పించిన వివరాల్లో మార్పులు ఉంటే జరిమానా చెల్లించి మార్చుకోవచ్చని బోర్డు తెలిపింది. పేరులో తప్పుల సవరణకు రూ.500, ద్వితీయ భాష, మాధ్యమం మార్చుకోడానికి రూ.వెయ్యి చొప్పున, గ్రూపు మార్పునకు రూ.3 వేలు ఈనెల 9లోపు చెల్లించాలని బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.