దిల్లీ: త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కింద భారత నౌకాదళంలోకి అగ్నివీరులను నియమించారు. వీరిలో మహిళలు ఉన్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ తెలిపారు. తొలిసారిగా మహిళలను నావికులుగా విధుల్లోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 3న ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అగ్నిపథ్ కింద దాదాపు 3000 మంది అగ్నివీరులను నేవీలోకి తీసుకున్నాం. ఇందులో 341 మంది మహిళలు ఉన్నారు. తొలిసారిగా నేవీలో మహిళా నావికులను నియమించాం’’ అని తెలిపారు. గత ఏడాది కాలంలో నౌకాదళం అనేక కీలక కార్యక్రమాలు చేపట్టిందని అడ్మిరల్ కుమార్ అన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ విధుల్లో చేరడం చారిత్రక ఘట్టమని కొనియాడారు. ఇక హిందూ మహాసముద్రంలోకి చైనా గూఢచర్య నౌకల ప్రవేశం గురించి కూడా ఆయన స్పందించారు. చైనా మిలిటరీ, పరిశోధనా నౌకల కదలికలపై నిఘా పెట్టామని, ఆ పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ‘‘ఆత్మనిర్భర్ భారత్పై కేంద్ర ప్రభుత్వం మాకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. 2047 నాటికి భారత నౌకాదళం ఆత్మనిర్భరత సాధిస్తుందని మేం హామీ ఇస్తున్నాం’’ అని నేవీ చీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఒకేసారి గ్రూప్స్ అన్ని నోటిఫికేషన్లు వస్తే ఏంచేయాలి?
‣ ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ నెగ్గేదెలా?
‣ టెన్త్తో రక్షణదళంలో ఉద్యోగం
‣ డిగ్రీ అభ్యర్థులకు మూడేళ్ల ప్రణాళిక!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.