* మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి
ఈనాడు, అమరావతి: ‘విదేశాల్లోని ప్రతిష్ఠాత్మకమైన 200 విశ్వవిద్యాలయాల్లో సీటు తెచ్చుకుని, జగనన్న విదేశీ విద్యా దీవెన కోసం దరఖాస్తు చేసుకునే వారందరికీ సాయం అందిస్తాం.. లబ్ధిదారుల సంఖ్యలో సీలింగ్ ఉండదు’ అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ‘గతంలో తెదేపా ప్రభుత్వ నిర్వాకం వల్ల ఈ పథకం నీరుగారిపోయింది, విజిలెన్స్ విచారణలో అనేక అవకతవకలు బయటపడ్డాయి. వాటన్నింటినీ సరిచేసి ఇప్పుడు విద్యార్థులకు పూర్తిస్థాయిలో సాయమందించేలా పథకాన్ని అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఫిబ్రవరి 3న ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.