* యూజీసీ ప్యానెల్ సిఫార్సు
దిల్లీ: విద్యార్థులు నిర్ణీత క్రెడిట్లు సాధిస్తే ఆయా కోర్సుల కనిష్ఠ కాలవ్యవధితో సంబంధం లేకుండా డిప్లొమా లేదా డిగ్రీ ధ్రువపత్రాలు పొందేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్యానెల్ ప్రతిపాదనలు రూపొందించింది. నిర్ణీత క్రెడిట్లు సాధించాక ధ్రువపత్రాలు పొందడానికి అర్హుడిగానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డిగ్రీ కోర్సులకు నామకరణం చేయాలని ప్యానెల్ సిఫార్సు చేసింది. సమకాలీన, మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా నామకరణాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ప్యానెల్ కమిటీ సభ్యులు యూజీసీకి ప్రతిపాదనలు సమర్పించారు. కమిషన్ ఆమోదం పొందిన తరవాత కొత్త విధివిధానాలను యూజీసీ ప్రకటించనుంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣’జీఆర్ఈ’లో ముఖ్య మార్పులివే..
‣ వీఎన్ఆర్వీజేఐఈటీ, హైదరాబాద్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.