* వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో పరీక్షలు
![]() |
ఈనాడు ప్రతిభ డెస్క్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) భారీ సంఖ్యలో కానిస్టేబుల్(జీడీ) నియామకాల ప్రక్రియకు సన్నద్ధమవుతోంది. ఎస్ఎస్సీ వార్షిక క్యాలెండర్ ప్రకారం నవంబర్ 24న నోటిఫికేషన్ వెలువడనుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 28 పూర్తి కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో రాత పరీక్షలు జరుగనున్నాయి. గతేడాది నవంబర్లో భారీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది సైతం అంత కంటే ఎక్కువ సంఖ్యలోనే పోస్టులు భర్తీ కానున్నాయి. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, ఎస్ఎస్ఎఫ్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్లో రైఫిల్మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్సీబీలో సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.