ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ఇంటర్ ద్వితీయ సంవత్సరం సైన్స్ గ్రూపు విద్యార్థులకు జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉచిత ఎంసెట్ శిక్షణ ఇవ్వనున్నారు. అందుకు డిసెంబరు నాటికి సిలబస్ను పూర్తి చేయాలని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ డిసెంబరు 5న ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఆదేశాలు జారీ చేశారు. రెగ్యులర్ తరగతులకు ఇబ్బంది కలగకుండా శిక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల ఇంటర్ విద్యాశాఖ అధికారులకు సూచించారు. జూనియర్ కళాశాలల్లోని శిక్షణ కేంద్రాల నుంచి ఎంపికైన విద్యార్థులకు ఏప్రిల్, మే నెలల్లో ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ సమ్మర్ కోచింగ్ నిర్వహించనున్నట్లు నవీన్ మిత్తల్ పేర్కొన్నారు. ఇందుకోసం ఫిబ్రవరి నెలాఖరులో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి జిల్లా, గ్రూపుల వారీగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.