విజయవాడ సిటీ, న్యూస్టుడే: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మేనేజ్మెంటు పాఠశాలల విద్యార్థులకు డిసెంబరు 2 నుంచి ఫార్మెటివ్ అసెస్మెంట్(ఎఫ్.ఎ.)- 2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర విద్యా పరిశోధన మండలి (ఎస్ఈఆర్టీ) రూపొందించిన ఉమ్మడి పరీక్ష పత్రం ద్వారా జరుగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి సి.వి.రేణుక తెలిపారు. ఇంతకుముందు ఫార్మెటివ్-1 పరీక్షలు క్లాస్రూమ్ బేస్డ్ (సీబీఏ) విధానంలో ఓఎంఆర్ పత్రాలతో నిర్వహించారు. ఇప్పుడు మాత్రం పాత విధానంలో జరగనున్నాయి. జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే 3.11 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఎటువంటి విమర్శలకు తావు లేకుండా ప్రధానోపాధ్యాయులు పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో ఆదేశించారు.
ఇగ్నోలో..
ఇగ్నో ఆధ్వర్యంలో నిర్వహించే డిసెంబర్- 2022 టర్మ్ ఎండ్ పరీక్షలు డిసెంబరు 2 నుంచి వచ్చే ఏడాది జనవరి 9వ తేదీ వరకు జరుగుతాయని వర్సిటీ ప్రాంతీయ కేంద్రం ఇన్ఛార్జి రీజినల్ డైరెక్టర్ డాక్టర్ కె. సుమలత డిసెంబరు 1న ప్రకటనలో తెలిపారు. విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలోని మొత్తం ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హాల్ టికెట్లు ఇగ్నో వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.