ప్రభుత్వం ఆదేశాలు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ గుర్తింపు ఆధారిత హాజరు నూరు శాతం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ఈ ఏడాది జనవరి 1 నుంచి, మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో జనవరి 16 నుంచి ముఖ గుర్తింపు ఆధారిత హాజరును ప్రవేశపెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) రేవు ముత్యాలరాజు ఫిబ్రవరి 6న సర్క్యులర్ జారీ చేశారు. ఉద్యోగులంతా ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఎన్రోల్ కావాలని, యాప్ ద్వారానే హాజరు నమోదు చేయాలని చాలాసార్లు ఉత్తర్వులు జారీ చేసినా... ఆశించిన విధంగా ఆ ప్రక్రియ జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉద్యోగులందరూ ఎన్రోల్ చేసుకునేలా చూడాలని కోరారు. ఎక్కడైనా అలా జరగకపోతే సంబంధిత కార్యాలయాల అధిపతులు, నోడల్ అధికారుల్నే బాధ్యుల్ని చేస్తామని స్పష్టం చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డెకరేషన్లకు కొన్ని కోర్సులు!
‣ వేదికపై ధీమాగా... నలుగురూ మెచ్చేలా!
‣ నిర్మాణ రంగంలో కొన్ని కోర్సులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.