ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్.ఐ./కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. ‘హైదరాబాద్కు చెందిన ప్రముఖ శిక్షణ సంస్థ ఐ.ఎ.సి.ఇ. భాగస్వామ్యంతో శిక్షణ తరగతులను ఆన్లైన్, ఆఫ్లైన్లో నిర్వహిస్తాం. డిసెంబరు 11న ఉదయం 9.30 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని 38 కేంద్రాల్లో రాత పరీక్ష ఉంటుంది. అందులో ప్రతిభ చూపిన వెయ్యి మందిని ఎంపిక చేసుకుంటాం. 21 పరీక్ష కేంద్రాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంటాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సెల్ నంబరు 7093651037కు ‘హాయ్’ అని ఆంగ్లంలో వాట్సప్ చేయాలి. మరిన్ని వివరాలకు 9533200400 నంబరులో సంప్రదించాలి’ అని ఆయన సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.