* కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడి
* కొత్తగా మెదక్, నల్గొండ, అదిలాబాద్, కొత్తగూడెంలలో
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో గేట్-2023 పరీక్ష కేంద్రాల సంఖ్య ఏడు నుంచి పదకొండుకు పెరిగిందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. కొత్తగా మెదక్, నల్గొండ, అదిలాబాద్, కొత్తగూడెంలలోనూ పరీక్ష రాయొచ్చని ఆయన పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలో తాను రాసిన లేఖకు స్పందించారని.. ఈ క్రమంలో గేట్-2023 పరీక్షల నిర్వహణ కమిటీ తాజా నిర్ణయం తీసుకుందని కిషన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడిక విద్యార్థులు పూర్తి సమయాన్ని సన్నద్ధతకు కేటాయించి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో గతంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ నగరాలలోనే గేట్ పరీక్ష కేంద్రాలు ఉండేవి. ఈ నేపథ్యంలో పరీక్ష రాసేందుకు తెలంగాణ విద్యార్థులు వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్న తీరును వివరిస్తూ కిషన్రెడ్డి లేఖ రాయడంతో తాజా నిర్ణయం వెలువడింది.
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఊహలకు రూపమిస్తూ... ఉత్పత్తులు రూపొందిస్తూ!
‣ ప్రేమ్జీ సంస్థల్లో యూజీ, పీజీ
‣ కంటెంట్ ఉంటే... క్రియేటర్లు మీరే!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.