‣ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడి
హైదరాబాద్: ఇంటర్మీడియట్లో ఈ విద్యాసంవత్సరం (2022-23) నుంచి మళ్లీ పూర్తి స్థాయి సిలబస్ అమలు కానుంది. రెండేళ్లుగా కరోనా వల్ల తరగతులు సరిగా నిర్వహించలేకపోవడంతో 30శాతం సిలబస్ను తొలగించారు. దానికి అనుగుణంగానే ఎంసెట్లోనూ 70శాతం సిలబస్ నుంచే పరీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితులు కుదుట పడటతో పాత విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు వందశాతం సిలబస్ అమల్లో ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు. వివరాలు త్వరలో ఇంటర్ బోర్డు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని స్పష్టం చేశారు.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ స్నేహితుల ఒత్తిడిని తట్టుకోవాలంటే?
‣ సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఖాళీలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.