• facebook
  • whatsapp
  • telegram

JEE Main Results: జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు విడుదల

 

దిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌(JEE main 2023) తొలి విడత పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. ఫిబ్ర‌వ‌రి 6న‌ ఉదయం తుది కీని విడుదల చేసిన ఎన్‌టీఏ (NTA).. తాజాగా ఫలితాల(JEE Main Results)ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీని ఎంటర్‌ చేసి ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

 

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

 

* ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగిన జేఈఈ మెయిన్‌- 2023 తొలి విడత పరీక్షలు రాసేందుకు దేశ వ్యాప్తంగా దాదాపు ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పేపర్‌ 1 (బీఈ/బీటెక్‌ కోర్సులు) పరీక్ష రాసేందుకు 8.22లక్షల మంది హాజరు కాగా.. వీరిలో 2.6లక్షల మందికి పైగా అమ్మాయిలు, 6లక్షల మందికి పైగా అబ్బాయిలు ఉన్నారు. అలాగే, పేపర్‌ 2 (బీ.ఆర్క్‌/బీ.ప్లానింగ్‌) పరీక్షను 46వేల మందికి పైగా రాయగా.. వీరిలో 25వేల మంది అబ్బాయిలు, 21వేల మందికి పైగా అమ్మాయిలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

 

* మరోవైపు, జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌ 6 నుంచి 12వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. తొలి విడత రాసిన విద్యార్థులు.. రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎన్‌టీఏ ఆల్‌ ఇండియా ర్యాంకుల్ని ప్రకటించనుంది. వీరిలో టాప్‌ 2.2లక్షల మంది విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఐఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ నిర్మాణ రంగంలో కొన్ని కోర్సులు!

‣ పరిశ్రమల సంరక్షకులు!

‣ వచ్చేస్తున్నాయ్‌... వర్చువల్‌ ల్యాబ్స్‌!

‣ టెన్త్‌ మార్కులతో పోస్టల్‌ ఉద్యోగం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.