ఎల్బీనగర్, న్యూస్టుడే: నిరుద్యోగులు జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని, ప్రతిభతో ఉద్యోగాలు సంపాదించుకోవాలని మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 11న సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించే మెగా జాబ్ మేళా గోడపత్రికను మంత్రి నివాసంలో ఎమ్మెల్యేతో కలిసి జనవరి 30న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఇది సదవకాశమని వినియోగించుకోవాలన్నారు. మేళాలో 108 కంపెనీలు పాల్గొంటున్నాయని, దాదాపు 10 వేల మందికి ఉద్యోగాలు దక్కుతాయన్నారు. ఏడవ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న వారికి అవకాశం ఉందన్నారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. కార్యక్రమంలో సెట్విన్ ఎండీ వేణుగోపాల్రావు, రమాకాంత్, రామ్కళ్యాణ్ పాల్గొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవితబీమాలో ఆఫీసర్ ఉద్యోగాలు
‣ పది పాసయ్యారా.. ఇదిగో మీకే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
‣ బాగా రాసేవాళ్లకు బోలెడు ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.