• facebook
  • whatsapp
  • telegram

KL Versity: కేఎల్‌ వర్సిటీ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తీరు అభినందనీయమన్న మంత్రి అమర్‌నాథ్‌
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకుని, పరిశోధనలపై దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్‌ సూచించారు. కేఎల్‌ విశ్వవిద్యాలయం విజయవాడ, హైదరాబాద్‌ క్యాంపస్‌లలో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించిన ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్ష ఫలితాలు(ఫేజ్‌-2)ను మార్చి 31న ఆయన విశాఖలో విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని, ఇక్కడి విద్యార్థులకు మంచి వార్షిక వేతనంతో ఉద్యోగాలొచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేఎల్‌ వర్సిటీ ప్రవేశ పరీక్ష ద్వారా ఏటా రూ.100 కోట్ల ఉపకార వేతనాలు ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రాంగణ నియామకాల్లో విద్యార్థులకు 100 శాతం ఉద్యోగాలు ఇప్పించడం మంచి పరిణామమని కొనియాడారు. వర్సిటీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 17 ఏళ్లుగా ప్రాంగణ నియామకాల్లో 100 శాతం విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారని, ఈ ఏడాది ఓ విద్యార్థి రూ.60 లక్షల వార్షికవేతనంతో ఎంపికయ్యారని వివరించారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.