* మార్చి 27న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
ప్రతిభ డెస్క్: దేశ వ్యాప్తంగా ఉన్న కేవీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ మేరకు మార్చి 21న అధికారికి ప్రకటనలను విడుదల చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి మార్చి 27న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. మార్చి 31, 2023 నాటికి ఆరేళ్లు నిండి ఉండాలి. అలాగే రెండో తరగతి ప్రవేశాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 3న ప్రారంభమై ఏప్రిల్ 12న ముగియనుంది. ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.