1. ఎడ్సెట్ కౌన్సెలింగ్ పునఃప్రారంభం
ఎడ్సెట్ కౌన్సెలింగ్ జనవరి 24 నుంచి పునఃప్రారంభించనున్నట్లు కన్వీనర్ రామమోహన్రావు తెలిపారు. అక్టోబరులో కౌన్సెలింగ్కు ప్రకటన విడుదల చేయగా.. రిజిస్ట్రేషన్ల అనంతరం వాయిదా పడింది. వెబ్ఐచ్ఛికాల నమోదుకు 27వరకు అవకాశం కల్పించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. జులై లేదా ఆగస్టులో గ్రూపు-3 పరీక్ష
రానున్న జులై లేదా ఆగస్టులో గ్రూపు-3 పరీక్ష జరగనుంది. ఈ మేరకు మొత్తం 1363 ఖాళీల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ జనవరి 23న రాత్రి ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు ఫిబ్రవరి 23 వరకు గడువిచ్చారు. టీఎస్పీఎస్సీ తన వెబ్సైట్లో సవివర నోటిఫికేషన్ను పూర్తి వివరాలతో పాటు దరఖాస్తుల కోసం లింక్ను కూడా పొందుపరిచింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఇంటర్లో కొత్తగా సీఈఏ గ్రూపు
ఇంటర్మీడియట్ విద్యలో కొత్తగా మరో గ్రూపు అందుబాటులోకి రానుంది. అకౌంటెన్సీ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తూ ఈ గ్రూపును వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో అకౌంటెన్సీతో పాటు కామర్స్, ఆర్థికశాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ఉండనున్నాయి. సీఈఏ గ్రూపుగా పిలవనున్నారు. ‘‘ఇంటర్స్థాయిలోనే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వీలుగా సీఈఏ గ్రూపును రూపొందిస్తున్నాం.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. మధ్యస్థంగా జేఈఈ మెయిన్ ప్రశ్నలు
తొలిరోజు (జనవరి 23న) జేఈఈ మెయిన్ ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నట్లు నిపుణులు తెలిపారు. గణితం ప్రశ్నలకు ఎక్కువ సమయం పట్టిందని, వాటికే దాదాపు సగం సమయం (80 - 90 నిమిషాలు) అవసరమైందని చెబుతున్నారు. జాతీయ సాంకేతిక విద్యాసంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా మంగళవారం జేఈఈ మెయిన్ పరీక్షలు ఆన్లైన్లో ప్రారంభమయ్యాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. 22 హెచ్ఓ పోస్టులకు 1686 దరఖాస్తులు
రాష్ట్ర ఉద్యానశాఖలో ఖాళీగా ఉన్న 22 ఉద్యాన అధికారి (హెచ్ఓ) పోస్టులకు మొత్తం 1686 దరఖాస్తులు అందినట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ జనవరి 24న ప్రకటించింది. ఈ పోస్టుల భర్తీకి డిసెంబర్ 22న ప్రకటన జారీచేసి జనవరి 2 నుంచి 24 వరకు దరఖాస్తులను స్వీకరించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.