• facebook
  • whatsapp
  • telegram

Latest News: 03-02-2023 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. 1,553 జేఎల్‌ఎం పోస్టుల భర్తీ

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌) 1,601 పోస్టుల భర్తీకి ఫిబ్ర‌వ‌రి 2న‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో 48 అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ)ఎలక్ట్రికల్‌, 1,553 జూనియర్‌ లైన్‌మెన్‌(జేఎల్‌ఎం) పోస్టులు ఉన్నాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. 7 నుంచి అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ ఉద్యోగార్థుల ధ్రువపత్రాల పరిశీలన

వైద్య, ఆరోగ్య శాఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను ఫిబ్ర‌వ‌రి 7 నుంచి 14 వరకు పరిశీలించనున్నట్లు  నియామక సంస్థ ఫిబ్ర‌వ‌రి 2న‌ తెలిపింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో...

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల ద్వారానే ‘ఐఆర్‌ఎంఎస్‌’ ఎంపికలు

ఈ ఏడాది భారతీయ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎంఎస్‌) అధికారుల ఎంపికలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల ద్వారానే చేపట్టాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. 5న జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష 

జాతీయ ప్రతిభా ఉపకారవేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్‌) ఫిబ్రవరి 5వ తేదీ ఫిబ్ర‌వ‌రి 5న‌ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సి.వి.రేణుక ఫిబ్రవరి 2న ఒక ప్రకటనలో తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. 60% హాజరుతోనూ ఇంటర్‌ పరీక్షలకు అనుమతి

ఇంటర్మీడియట్‌లో 60% అంతకంటే ఎక్కువ హాజరు ఉన్న విద్యార్థులను పరీక్షకు అనుమతించేందుకు ఇంటర్‌ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. బోర్డు నిబంధనల ప్రకారం 75% హాజరు తప్పనిసరి. సరైన కారణాలతో ఏ విద్యార్థికైనా 60%-75% వరకు హాజరు ఉంటే ప్రతిపాదనలు పంపాలని ప్రిన్సిపాళ్లకు బోర్డు సూచించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.