ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 957 స్టాఫ్ నర్సుల పోస్టులను ఒప్పంద విధానంలో భర్తీ చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సవరించిన నోటిఫికేషన్ను జారీ చేసింది. గత వారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని అవసరాల మేరకు 461 స్టాఫ్ నర్సు పోస్టుల ఖాళీల భర్తీకి ఓ నోటిఫికేషన్ వెలువడిన విషయం విదితమే. వీటికి అదనంగా మరో 496 స్టాఫ్ నర్సుల పోస్టులను వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లోని అవసరాల కోసం భర్తీ చేయాలని నిర్ణయించారు. మొత్తం 957 పోస్టుల భర్తీకి డిసెంబరు 2న సవరించిన నోటిఫికేషన్ను జారీ చేసింది. జోన్-1లో 163, జోన్-2 264, జోన్-3 239, మిగిలిన స్టాఫ్ నర్సుల పోస్టులను జోన్-4లో భర్తీ చేస్తామని పేర్కొంది. 8వ తేదీ వరకు విశాఖ, కడప, రాజమహేంద్రవరం, గుంటూరు ప్రాంతీయ కార్యాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని ఓ ప్రకటనలో ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రామిరెడ్డి తెలిపారు. దరఖాస్తులను హెచ్టీటీటీ://సీఎఫ్డబ్ల్యూ.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడు చేసుకోవచ్చని, పూర్తి వివరాలు వెబ్సైట్లో ఉన్నాయని పేర్కొన్నారు.
‣ వైద్య ఆరోగ్య శాఖలో ఉమ్మడి నోటిఫికేషన్ ద్వారా పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. ఒకే అర్హతతో జరగాల్సిన ఈ పోస్టుల భర్తీపై ఆయా శాఖల మధ్య లోపించిన సమన్వయం కారణంగా తొలి నోటిఫికేషన్ సవరించాల్సి ఉంది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆఫీసర్ కొలువుకు నౌకాదళం పిలుపు!
‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!
‣ కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.