* ఒక్కో పేపర్కు ఏకంగా రూ.10 వేలు వసూలు
ఈనాడు, హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ పరిధిలో బ్యాక్లాగ్ పరీక్షలు రాసే విద్యార్థులపై పెద్ద పిడుగు. పరీక్ష ఫీజు రూపంలో ఆర్థికంగా తీవ్ర భారాన్ని వర్సిటీ మోపింది. నిర్దేశిత పరీక్ష ఫీజుతోపాటు పీనల్ ఛార్జీల పేరిట ఒక్కొక్క పేపర్కు రూ.10 వేలు చెల్లించాలని నిర్దేశించింది. 12 ఏళ్లుగా పీజీ కోర్సుల్లో మిగిలిపోయిన బ్యాక్లాగ్స్ పూర్తి చేసేందుకు ‘వన్టైమ్ ఛాన్స్’కు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇటీవల అవకాశం కల్పించింది. డిసెంబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. 2010-2017 మధ్యకాలంలో చదివిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకునే వీలుంది.
దరఖాస్తుకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జనవరి 7వ తేదీని తుది గడువుగా నిర్ణయించినట్లు పరీక్షల విభాగం నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీనగేశ్ తెలిపారు. రూ.300 అపరాధ రుసుముతో జనవరి 17 వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. అన్ని పేపర్లకు కలిపి రూ.1950తోపాటు మెమోకు రూ.100 కలుపుకొని రూ.2050, రెండు పేపర్లకు రూ.1060 ఫీజుతోపాటు మెమోకు రూ.100 కలుపుకొని రూ.1160 చెల్లించాల్సి ఉంది. దీనికి అదనంగా పేపర్కు రూ.10 వేలు చెల్లించాల్సి ఉండటంతో పరీక్ష ఫీజు ఆర్థికంగా తీవ్ర భారం కానుందని విద్యార్థులు వాపోతున్నారు. ఎవరైనా విద్యార్థికి రెండు పేపర్లు ఉంటే రూ.21,160 కట్టాల్సిన పరిస్థితి. దీంతో ఫీజులను చూసి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఫారిన్ ట్రేడ్.. అద్భుత కెరియర్!
‣ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేక అధికారులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.