వేతనాలు చెల్లించేది జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లే
ప్రభుత్వం ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసే కాంట్రాక్టు అధ్యాపకుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై వారికి వేతనాలను డ్రా చేసి ఇచ్చే అధికారాన్ని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు అప్పగిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బయోమెట్రిక్ ఆధారిత హాజరు మేరకు వారికి వేతనాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటివరకు జీతాల చెల్లింపు అధికారం ఆయా జిల్లాల ఇంటర్ విద్యాశాఖ అధికారులకు ఉండేది. దానివల్ల జిల్లాలోని ఏ ఒక్క కళాశాల నుంచి వివరాలు అందకపోయినా మిగిలిన వారికి వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరిగేది. ఇకపై ఆ సమస్య ఉండదని కాంట్రాక్టు అధ్యాపక సంఘం నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 404 కళాశాలల్లో 3,541 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.