విశాఖపట్నం (ఏయూ ప్రాంగణం), న్యూస్టుడే: దక్షిణ భారత దేశ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సదస్సు జనవరి 31 నుంచి రెండు రోజుల పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా జరగనుందని ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తెలిపారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) అధ్యక్షుడు ఆచార్య సురంజన్దాస్తో కలిసి జనవరి 30న ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంగళవారం బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభిస్తారన్నారు. ఈ సదస్సుకు 140 విశ్వవిద్యాలయాల ఉపకులపతులు హాజరుకానున్నారని తెలిపారు. ‘రీసెర్చ్ ఎక్స్లెన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై ఈ సదస్సును నిర్వహిస్తామన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరైన రివిజన్ సక్సెస్ సూత్రం!
‣ ఎన్సీసీ క్యాడెట్లకు ఆర్మీ ఆహ్వానం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.