* ప్రస్తుతం మొత్తం పోస్టుల సంఖ్య 45,284
* సవరణ ప్రకటన విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్/ రైఫిల్మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీ ప్రకటనలో ఖాళీల సంఖ్యను భారీగా పెంచింది. 20,915 పోస్టులను అదనంగా చేర్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 45,284కి చేరింది. మొదట 24,369 ఖాళీలతో నోటిఫికేషన్ వెలువడింది. తర్వాత ఆ సంఖ్యను పెంచుతూ ప్రకటనను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో రైఫిల్మ్యాన్ (జనరల్ డ్యూటీ); నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)లో సిపాయి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఆ మేరకు కమిషన్ రాత పరీక్ష నిర్వహించనుంది. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ నవంబరు 30, 2022. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.