• facebook
  • whatsapp
  • telegram

State Board Exams: సీబీఎస్‌ఈ విధానంలోనే రాష్ట్ర బోర్డు పరీక్షలు

* పదో తరగతిలో ఐదు సబ్జెక్టుల విధానం

* ఐచ్ఛికంగా నైపుణ్య సబ్జెక్టు, హిందీ భాష

 

ఈనాడు, అమరావతి: సీబీఎస్‌ఈ విధానంలోనే రాష్ట్ర బోర్డు పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండింటికి ఒకేసారి పరీక్షలు నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1046 పాఠశాలలకు గతంలో సీబీఎస్‌ఈ బోర్డు అనుబంధ గుర్తింపునిచ్చింది. ఈ విద్యార్థులు 2025లో పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. సీబీఎస్‌ఈ విధానంలో పదో తరగతిలో ఐదు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. తొమ్మిదో తరగతి నుంచే ఐదు సబ్జెక్టుల విధానం అమలవుతుంది. ప్రస్తుతం సీబీఎస్‌ఈ గుర్తింపున్న పాఠశాలల విద్యార్థులు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. వీరికి ఐదు సబ్జెక్టుల విధానం అమలు చేయాల్సి ఉంది. మొదటి భాషగా ఆంగ్లం, రెండో భాషగా తెలుగు తప్పనిసరి అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఎస్‌ఈ పరీక్షల విధానంపై చర్చించేందుకు సెప్టెంబ‌రు 15న‌ సమగ్రశిక్ష అభియాన్‌ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. కొన్ని పాఠశాలలకు సీబీఎస్‌ఈ, మరికొన్నింటికి రాష్ట్ర బోర్డు విధానం పాటించడం వల్ల ఇబ్బందులొచ్చే అవకాశం ఉన్నందున ఒకే విధానం అమలుచేయాలని నిర్ణయించారు. సీబీఎస్‌ఈలో ఆంగ్లం, తెలుగు భాషలతోపాటు సామాన్య, సాంఘికశాస్త్రాలు, గణితం సబ్జెక్టులు తప్పనిసరిగా ఉంటాయి. హిందీ, నైపుణ్యాభివృద్ధి సబ్జెక్టులను ఐచ్చికంగా అమలుచేస్తారు.

ఇదే విధానాన్ని రాష్ట్ర బోర్డు అమలుచేస్తుంది. భాషలు కాకుండా మిగతా మూడు సబ్జెక్టుల్లో ఏదైనా ఒక్కటి అనుత్తీర్ణులైతే ఐచ్చికంగా అమలు చేసిన సబ్జెక్టును ప్రామాణికంగా తీసుకుంటారు.

తొమ్మిది, పదో తరగతుల్లో హిందీ సబ్జెక్టును ఐచ్ఛికంగా పెట్టకపోతే హిందీ టీచర్లు ఖాళీగా మారే అవకాశాలున్నాయి. దీంతో విద్యార్థులు ఐచ్ఛికంగా ఎంపిక చేసుకున్నా, చేసుకోకపోయినా హిందీని మాత్రం బోధిస్తారు. విద్యార్థులు

సబ్జెక్టును ఎంచుకోవడం వారి ఇష్టం.

సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌ ప్రకారమే రాష్ట్ర బోర్డు పరీక్షలు నిర్వహిస్తారు. మార్చిలో పరీక్షలు పూర్తి చేసి ఏప్రిల్‌లోనే ఆ తర్వాత తరగతికి సంబంధించిన బోధనను ప్రారంభిస్తారు. మే నెల నుంచి సెలవులు ఇస్తారు.
హైస్కూల్‌ ప్లస్‌లో ఉన్న ప్రధానోపాధ్యాయులను ప్రిన్సిపళ్లుగా మార్పు చేయనున్నారు. ఇంటర్మీడియట్‌కు బోధించేవారికి పీజీటీ పదోన్నతి కల్పిస్తారు. రాష్ట్రంలో కొత్తగా మరో 220 పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌ బోధన ప్రారంభించే అవకాశముంది.
 

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి స్టడీ మెటీరియల్

తెలుగు TM EM
హిందీ TM EM
ఇంగ్లిష్ TM EM
గణిత శాస్త్రం TM EM
జీవశాస్త్రం TM EM
సాంఘిక శాస్త్రం TM EM
భౌతిక రసాయన శాస్త్రం TM EM
     
‣ మోడ‌ల్‌ పేప‌ర్లు TM EM
‣ ప్రీవియ‌స్ పేప‌ర్లు    TM EM

టెన్త్ క్లాస్‌ మోడ‌ల్ పేపర్లు - 2023 (e-Books)


 


మరింత సమాచారం... మీ కోసం!

‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

‣ ‘పవర్‌ బీఐ’తో బెస్ట్‌ కెరియర్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.