* 12 వరకు నిర్వహణ
* షెడ్యూలు విడుదల
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) గ్రూప్ ప్రధాన (మెయిన్స్) పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు షెడ్యూల్ను జనవరి 31న విడుదల చేసింది. వచ్చే జూన్ 5 నుంచి 12 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అందులో 11వ తేదీ ఆదివారమైనందున ఆ రోజు పరీక్ష ఉండదని వెల్లడించింది. ఈ పరీక్షలు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో జరుగుతాయంది. జనరల్ ఇంగ్లిష్ మినహా మిగతా అన్ని పేపర్లకు అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో పరీక్ష రాసుకోవచ్చని వెల్లడించింది. మొత్తం పరీక్షల్లో ఒక్కదానికి గైర్హాజరయినా వారిని అనర్హులుగా ప్రకటిస్తామంది. తెలంగాణలో తొలిసారిగా నిర్వహించే గ్రూప్-1లో 503 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 16న గ్రూప్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో బహుళజోన్ రిజర్వేషన్ల వారీగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తం 25,150 మంది అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేసింది. జనవరి 14న ప్రిలిమ్స్ నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ తాజాగా మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ టెన్త్ మార్కులతో పోస్టల్ ఉద్యోగం!
‣ బీటెక్ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం!
‣ కోస్ట్గార్డ్ కొలువు కావాలా?
‣ సరైన రివిజన్ సక్సెస్ సూత్రం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.