• facebook
  • whatsapp
  • telegram

TSPSC: గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల తేదీలు ఖరారు

* జూన్‌ 5 నుంచి 12 వరకు నిర్వహణ

 

 

హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష తేదీలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఖరారు చేసింది. జూన్‌ 5 నుంచి 12 వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల వెల్లడించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాల్లో మొత్తం 25,050 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. హైకోర్టు ఆదేశాలతో సమాంతర విధానంతో రిజర్వేషన్లు చేపట్టినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మల్టీ జోన్‌, రిజర్వేషన్‌ ప్రకారం 1:50 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారు. మొత్తం 503 గ్రూప్‌-1 పోస్టులకు గాను 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్‌కు రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా, 2,86,051 అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. 
 

పరీక్ష తేదీ సబ్జెక్టు
జూన్‌ 5          జనరల్‌ ఇంగ్లిష్‌(క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌)
జూన్‌ 6          పేపర్‌-1(జనరల్‌ ఎస్సే)
జూన్‌ 7          పేపర్‌-2(హిస్టరీ, కల్చర్‌, జాగ్రఫీ)
జూన్‌ 8           పేపర్‌-3(ఇండియన్‌ సొసైటీ, కాన్‌స్టిస్ట్యూషన్‌ అండ్‌ గవర్నెన్స్‌)
జూన్‌ 9          పేపర్‌-4(ఎకానమీ, డెవలప్‌మెంట్‌)
జూన్‌ 10          పేపర్‌-5(సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌) 
జూన్‌ 12          పేపర్‌-6(తెలంగాణ మూవ్‌మెంట్‌, స్టేట్‌ ఫార్మేషన్‌) 


 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ టెన్త్‌ మార్కులతో పోస్టల్‌ ఉద్యోగం!

‣ బీటెక్‌ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం!

‣ కోస్ట్‌గార్డ్‌ కొలువు కావాలా?

‣ సరైన రివిజన్‌ సక్సెస్‌ సూత్రం!

‣ ఇంజినీర్లకు ఆర్మీ ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 31-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.