కళాశాల విద్యాశాఖ కమిషనర్
ఈనాడు, అమరావతి: విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా జీవన నైపుణ్యాలు, నైపుణ్యాభివృద్ధి పుస్తకాలను అందిస్తున్నామని కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. పుస్తకాల ముద్రణ, కళాశాలకు చేరవేసేందుకు అయ్యే రవాణా ఖర్చులను పరిగణనలోకి తీసుకొని రూ.70 నుంచి రూ.100 వరకు పుస్తక ధరగా నిర్ణయించామని వెల్లడించారు. ‘పుస్తకాలు కొంటేనే హాల్టికెట్లు’ శీర్షికతో ఈనాడులో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. పాఠ్యపుస్తకాలు కొనకపోతే హాల్టిక్కెట్లు నిలిపివేయమని కమిషరేట్ నుంచి ఎలాంటి ఆదేశాలివ్వలేదని వెల్లడించారు. పుస్తక ముద్రణ విషయంలో అత్యంత పారదర్శకంగా, నిబంధనలు పాటించి టెండర్లు నిర్వహించామని తెలిపారు. పేజీకి 0.21 పైసలు మాత్రమే నిర్ణయించి ముద్రణ సంస్థకు అప్పగించామని వివరించారు. నిష్ణాతులైన అధ్యాపకులతో పాఠ్యపుస్తకాలను రూపొందించామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే ఎయిడెడ్ సిబ్బందికి పోస్టింగులు, జోనల్ మార్పు చేశామని.. ఇందులో మామూళ్లు ఇవ్వడం, అధికారుల వసూలు ఆరోపణలు అవాస్తవమని వెల్లడించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!
‣ నకిలీ వెబ్సైట్లతో జాగ్రత్త!
‣ అందరి అంచనాల ప్రకారం ఉండాలా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.