• facebook
  • whatsapp
  • telegram

Books: లాభాపేక్ష లేకుండా పాఠ్యపుస్తకాలు అందిస్తున్నాం

కళాశాల విద్యాశాఖ కమిషనర్‌
ఈనాడు, అమరావతి: విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా జీవన నైపుణ్యాలు, నైపుణ్యాభివృద్ధి పుస్తకాలను అందిస్తున్నామని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. పుస్తకాల ముద్రణ, కళాశాలకు చేరవేసేందుకు అయ్యే రవాణా ఖర్చులను పరిగణనలోకి తీసుకొని రూ.70 నుంచి రూ.100 వరకు పుస్తక ధరగా నిర్ణయించామని వెల్లడించారు. ‘పుస్తకాలు కొంటేనే హాల్‌టికెట్లు’ శీర్షికతో ఈనాడులో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. పాఠ్యపుస్తకాలు కొనకపోతే హాల్‌టిక్కెట్లు నిలిపివేయమని కమిషరేట్‌ నుంచి ఎలాంటి ఆదేశాలివ్వలేదని వెల్లడించారు. పుస్తక ముద్రణ విషయంలో అత్యంత పారదర్శకంగా, నిబంధనలు పాటించి టెండర్లు నిర్వహించామని తెలిపారు. పేజీకి 0.21 పైసలు మాత్రమే నిర్ణయించి ముద్రణ సంస్థకు అప్పగించామని వివరించారు. నిష్ణాతులైన అధ్యాపకులతో పాఠ్యపుస్తకాలను రూపొందించామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే ఎయిడెడ్‌ సిబ్బందికి పోస్టింగులు, జోనల్‌ మార్పు చేశామని.. ఇందులో మామూళ్లు ఇవ్వడం, అధికారుల వసూలు ఆరోపణలు అవాస్తవమని వెల్లడించారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!

‣ నకిలీ వెబ్‌సైట్‌లతో జాగ్రత్త!

‣ అందరి అంచనాల ప్రకారం ఉండాలా?

‣ సొంత నోట్స్‌తో సక్సెస్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.