దిల్లీ: కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ 9, 11వ తరగతి పరీక్షలు నిర్వహించాలని తన పరిధిలోని విద్యాసంస్థలను సీబీఎస్ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని కూడా అందులో సిఫార్సు చేసింది. ‘పరీక్షల నిర్వహణ సమయంలో కొవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందే. 2021-22 విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించడం సముచితం. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవాలి’ అని సీబీఎస్ఈ పేర్కొంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.