ఈనాడు, హైదరాబాద్: ప్రధానమంత్రి కౌషల్ వికాస్ యోజన(పీఎంకేవీవై) కింద జాతీయ స్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఫిబ్రవరి 28లోగా దరఖాస్తు చేసుకోవాలని ఉపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధి శాఖ డైరెక్టర్ కేవై నాయక్ సూచించారు. జిల్లా, జోనల్, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలో ఈ పోటీలు ఉంటాయని, 1996, జనవరి 1వ తేదీ తరువాత జన్మించిన వారు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని వివరించారు. ఆసక్తిగల విద్యార్థులు https://worldskillsindia.co.in/indiaskill2021/ వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మెకాట్రోనిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్ ఛాలెంజ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ- వాటర్ టెక్నాలజీ, ఐటీ నెట్వర్క్ కేబ్లింగ్ రంగాల్లో పోటీ ఉంటుందన్నారు. మిగిలిన రంగాల్లోని పోటీల్లో పాల్గొనేందుకు 1999, జనవరి 1వ తేదీ తరువాత జన్మించిన విద్యార్థులు అర్హులని చెప్పారు. గత ఏడాది నిర్వహించిన పోటీలో పాల్గొన్న అభ్యర్థులు ఈ ఏడాది నమోదు చేసుకునేందుకు అనర్హులని తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.