మాచవరం, న్యూస్టుడే: మాచవరం ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల ప్రభుత్వ డిగ్రీ కళాశాల (మహిళలు)లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ డాక్టర్ వి.నీరజ తెలిపారు. ఉచిత వసతి, భోజన సదుపాయాలతో పాటు ఉచిత పుస్తకాలు అందజేస్తామన్నారు. బీకామ్ (జనరల్)లో 30 సీట్లు, బీకాం (కంప్యూటర్స్)లో 30 సీట్లు, బీఎస్సీ (ఎంపీసీఎస్)కోర్సులో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంటర్ లేదా తత్సమాన అర్హతగల పరీక్ష ఉత్తీర్ణత ధ్రువపత్రం, తెల్లరేషన్ కార్డు, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8లక్షల లోపు ఉన్న ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల, విద్యార్థిని ఆధార్కార్డులు, బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం, పదో తరగతి మార్కుల జాబితాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 23 నుంచి 31వ తేదీ లోపు ఆన్లైన్ అడ్మిషన్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎండీసీ)లో నమోదు చేసుకోవాలన్నారు. వచ్చే నెల ఒకటి నుంచి 5వ తేదీ వరకు ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (విజయవాడ), డాక్టర్ వీఎస్ కృష్ణ కళాశాల (విశాఖపట్నం), ఎస్వీ వర్సిటీ (తిరుపతి)లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. ప్రత్యేక తరగతికి చెందిన వారికి వచ్చే నెల 3, 4 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన, ఆగస్టు 8 నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు, 13 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసేందుకు, 20న సీటు కేటాయింపు, సంబంధిత కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు. 25వ తేదీ నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని ఆమె వివరించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.