ఆర్ఆర్బీ గ్రూప్-డి(ఆర్ఆర్సీ 01/2019) పరీక్ష రాసి, రిజల్ట్ కోసం ఎదురుచూసే అభ్యర్థులకు శుభవార్త... రైల్వే శాఖ డిసెంబర్ 22న రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. రైల్వే బోర్డు అధికారిక వెబ్సైట్లో సికింద్రాబాద్, భువనేశ్వర్, కోల్కతా, భోపాల్, గువాహటి జోన్ల ఫలితాలను ప్రకటించింది. మిగిలిన జోన్ల ఫలితాలు రావాల్సి ఉంది. సికింద్రాబాద్ జోన్లో సికింద్రాబాద్ 24,596 మంది తర్వాతి పరీక్షలకు ఎంపికయ్యారు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 2023, జనవరిలో నిర్వహించే శారీరక సామర్థ్య పరీక్ష(ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు)కు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. పీఈటీ తేదీలను సంబంధిత ఆర్ఆర్బీలు త్వరలో వెల్లడించనున్నాయి. ఎంపిక ప్రక్రియపై తాజా సమాచారం కోసం అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ చూడాలని రైల్వే శాఖ సూచించింది.
1,03,769 కొలువులకు నియామకాలు
గ్రూప్-డి నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)ను దేశవ్యాప్తంగా దశల వారీగా నిర్వహించిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల క్రితం 16 ఆర్ఆర్బీల పరిధుల్లో 1,03,769 గ్రూప్-డి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కాగా సుమారు కోటి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 11 వరకు ఆన్లైన్ విధానంలో రాత పరీక్షను వివిధ దశల్లో రైల్వే శాఖ నిర్వహించింది. అక్టోబర్లో పరీక్ష ప్రాథమిక కీతో పాటు.. రెస్పాన్స్ షీట్ విడుదలయ్యాయి.
మూడు దశల్లో ఎంపిక
గ్రూప్-డి ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటిది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఇది ఇప్పటికే పూర్తయింది. దీని తర్వాత శారీరక సామర్థ్య పరీక్షలు ఉంటాయి. అభ్యర్థులు పీఈటీకి అర్హత సాధించాలంటే కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ స్కోరు సాధించాల్సి ఉంటుంది. అనంతరం వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ మూడు దశల్లో విజయవంతంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.
ముఖ్య గమనిక: రైల్వే జోన్ల వారీగా ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో సంబంధిత ఆర్ఆర్సీ వెబ్సైట్లో వివరాలు చూసుకోవచ్చు.
ఆర్ఆర్బీ సికింద్రాబాద్ గ్రూప్-డి రాత పరీక్ష ఫలితాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.