* విజయవాడకు చెందిన రవికిషోర్కు 300 మార్కులు!
ఈనాడు, హైదరాబాద్: జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) జులై 6న రాత్రి జేఈఈ మెయిన్స్ మొదటి విడత పరీక్షల తుది కీ విడుదల చేసింది. మొదటి విడత పరీక్షలు జూన్ 23 - 29 తేదీల మధ్య జరిగాయి. ఇటీవలే ప్రాథమిక కీ విడుదల చేసిన ఎన్టీఏ వాటిపై అభ్యంతరాలను స్వీకరించింది. జులై 6న తుది కీ విడుదల చేసింది. ఆ ప్రకారం విజయవాడకు చెందిన పెనికలపాటి రవికిషోర్కు 300కి 300 మార్కులు దక్కాయి. దాంతో మొదటి ర్యాంకు ఖాయమైంది. దాదాపు 9 లక్షల మంది పరీక్షలు రాశారు. 300 మార్కుల పరీక్షలో కొందరు 300 మార్కులు సాధించారు. తుది కీలో 12 ప్రశ్నలకు జవాబులు మారాయని శ్రీచైతన్య గ్రూపు సంస్థల ఐఐటీ జాతీయ కన్వీనర్ ఎం.ఉమాశంకర్ తెలిపారు. చివరి విడత పరీక్ష జులై 21వ తేదీ నుంచి మొదలవుతుంది. తర్వాత రెండింటిలో ఉత్తమ స్కోర్ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను విడుదల చేస్తారు. గత ఏడాది మొత్తం 18 మందికి ప్రథమ ర్యాంకు రాగా అందులో తెలుగు విద్యార్థులు ఆరుగురు ఉన్నారు.
ఐఐటీ బాంబేలో పరిశోధనే లక్ష్యం
కానూరు, న్యూస్టుడే: ఐఐటీ బాంబేలో కంప్యూటర్స్ సైన్స్ చదివి పరిశోధనలు చేయడమే తన లక్ష్యమని జేఈఈ మెయిన్స్లో 300కు 300 మార్కులు సాధించిన రవికిషోర్ పేర్కొన్నారు. అతను గోసాల శ్రీచైతన్యలో ఇంటర్ పూర్తిచేసి ప్రస్తుతం జేఈఈ అడ్వాన్సుడుకు శిక్షణ తీసుకుంటున్నారు. గుంటూరుకు చెందిన రవికిషోర్ తండ్రి ఆదినారాయణ ప్రైవేటు ఉద్యోగి. తల్లి నందకుమారి ప్రభుత్వ ఉద్యోగి. పదో తరగతిలో జీపీఏ 10, ఇంటర్లో 961 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా రవికిషోర్ మాట్లాడుతూ.. రోజుకు 16 గంటలు చదవడం, ఎప్పటికప్పుడు సబ్జెక్టుల్లో అనుమానాలు నివృత్తి చేసుకోవడం, ప్రణాళికాబద్ధంగా సాధన చేయడంతో ఈ మార్కులు వచ్చాయని తెలిపారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఈడీ, జూనియర్ అసిస్టెంట్స్ పరీక్షలకు ఇదుగో వ్యూహం
‣ అన్ని పరీక్షల్లోనూ ఉండే ప్రశ్నలివి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.