విజయవాడ సిటీ, న్యూస్టుడే: జాతీయ ప్రతిభా ఉపకారవేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్) ఫిబ్రవరి 5వ తేదీ ఫిబ్రవరి 5న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సి.వి.రేణుక ఫిబ్రవరి 2న ఒక ప్రకటనలో తెలిపారు. హాల్టికెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in లో పాఠశాల లాగిన్లో అందుబాటులో ఉంచామని వివరించారు. ఇంకా పొందని విద్యార్థులు వెంటనే తమ ప్రధానోపాధ్యాయులను సంప్రదించి తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని, మొబైల్, కాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు తమ వెంట తీసుకురావద్దని చెప్పారు.
పరీక్ష కేంద్రాలు ఇవే..
నందిగామ: జడ్పీ ఉన్నత పాఠశాల (నందిగామ), శ్రీవిద్య ఉన్నత పాఠశాల (రైతుపేట), శ్రీచైతన్య ఉన్నత పాఠశాల(రైతుపేట), నారాయణ ఉన్నత పాఠశాల (రైతుపేట)
తిరువూరు: జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల (నడిమి తిరువూరు), ప్రభుత్వ ఉన్నత పాఠశాల (తిరువూరు), శ్రీనిధి టెక్నో ఉన్నత పాఠశాల (తిరువూరు)
విజయవాడ: కేబీసీ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల (పటమట), కేఎస్ఆర్ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల (పటమట లంక), బీఎస్ఆర్కే ఎంసీ ఉన్నత పాఠశాల (మొగల్రాజపురం), ఏకేటీపీఎంసీ ఉన్నత పాఠశాల (సత్యనారాయణపురం), ఎంకే బేగ్ ఎంసీ ఉన్నత పాఠశాల (అజిత్ సింగ్ నగర్), గాంధీజీ ఎంపీఎల్ ఉన్నత పాఠశాల (వన్టౌన్)
మరింత సమాచారం... మీ కోసం!
‣ బీటెక్ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం!
‣ కోస్ట్గార్డ్ కొలువు కావాలా?
‣ సరైన రివిజన్ సక్సెస్ సూత్రం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.