యూపీఎస్సీ వెల్లడి
ఈనాడు, దిల్లీ: ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే జనవరి 7, 8, 9, 15, 16 తేదీల్లో సివిల్స్ (మెయిన్)-2021 పరీక్షలు ఉంటాయని యూపీఎస్సీ జనవరి 5న స్పష్టం చేసింది. దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు ప్రబలుతుండటం, పలు రాష్ట్రాల్లో ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో అన్ని పరిస్థితులను సమీక్షించి.. యథావిధిగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో అభ్యర్థులు, పరీక్షల విధుల్లో పాల్గొనేవారు పరీక్ష కేంద్రాలకు రాకపోకలు సాగించేందుకు, ఇతరత్రా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యూపీఎస్సీ సూచించింది. ముఖ్యంగా కంటైన్మెంటు, మైక్రో కంటైన్మెంటు జోన్ల నుంచి వచ్చే అభ్యర్థులు, పరీక్షల విధుల్లో పాల్గొనేవారి రాకపోకలకు ఇబ్బంది లేకుండా అవసరమైతే ఈ-అడ్మిట్, ఐడీ కార్డులు జారీ చేయాలని పేర్కొంది. అభ్యర్థులు, పరీక్షల విధుల్లో పాల్గొనేవారు మాస్కులు ధరించాలని, పారదర్శకంగా ఉండే హ్యాండ్ శానిటైజర్ బాటిలును అభ్యర్థులే వెంట తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస సమస్యలతో బాధపడుతున్నవారు వేరుగా కూర్చొని పరీక్షలు రాసేందుకు వీలుగా ప్రతి పరీక్ష కేంద్రంలో రెండు అదనపు గదులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.