ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్లో అమలు చేయనున్న నూతన కరిక్యులమ్ (పాఠ్యప్రణాళిక)కు జేఎన్టీయూ పాలకమండలి ఆమోదం తెలిపింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా వచ్చే ఏడాది నుంచి జేఎన్టీయూలో కొత్త పాఠ్య ప్రణాళిక అమలు చేయాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. ఇటీవల బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశాల్లో కొత్త కరిక్యులమ్ను సిద్ధం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త పాఠ్య ప్రణాళిక అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా రెండో ఏడాదిలో విద్యార్థులు ఇంజినీరింగ్ నుంచి ఎగ్జిట్(నిష్రమణ) అయితే డిప్లొమా డిగ్రీ అందించనున్నారు. ఒకేసారి రెండు డిగ్రీలు చేసేందుకు వీలుగా ఆన్లైన్లో బీబీఏ కోర్సును అందించాలని నిర్ణయించింది. జూన్ 15న జరిగిన వర్సిటీ పాలకమండలి సమావేశం వీటికి ఆమోదం తెలిపింది. త్వరలో జేఎన్టీయూ న్యాక్ గుర్తింపునకు వెళ్లాల్సి ఉండగా అనుసరించాల్సిన విధి విధానాలపైనా చర్చించింది. ఇంజినీరింగ్ కళాశాల, ఐఎస్టీలను పునర్వ్యస్థీకరించి ఏకీకృత యూనిట్గా తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించే విషయంపై చర్చించారు. అజెండాలోని పలు అంశాలపై సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిత్తల్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మరింత సమాచారం ... మీ కోసం!
ప్రాంగణ నియామకాల్లో నెగ్గాలంటే..!
ప్రశ్నించే వారికే కార్పొరేట్ కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.