ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 47 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యాసంవత్సరానికి తొలి విడతగా 53 స్వల్పకాలిక ఒకేషనల్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నట్లు ఇంటర్ విద్య కమిషనర్ జలీల్ తెలిపారు. వాటిలో అయిదో తరగతి నుంచి ఇంటర్ విద్యార్హతతో చదవదగ్గ కోర్సులు ఉన్నాయని, కోర్సును బట్టి 3-9 నెలల పాటు తరగతులు నడుస్తాయని పేర్కొన్నారు. ఫీజు రూ.600 నుంచి రూ.1800 వరకు ఉంటుందన్నారు. సీసీటీవీ టెక్నాలజీ, సోలార్ లైటింగ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, హాస్పిటల్ మేనేజ్మెంట్, ఇంట్రడక్షన్ టు మెషిన్ లెర్నింగ్, పైథాన్ అండ్ కోడింగ్, డేటా అనలిటిక్స్ తదితర కోర్సులున్నాయి.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ పల్లె బ్యాంకుల్లో వేల కొలువులు
‣ డీజే కావాలని అనుకుంటున్నారా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.