* వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి: సామాజిక వర్గాలు, మహిళల కోసం గుర్తించిన పోస్టుల భర్తీకి పలుమార్లు నోటిఫికేషన్లు జారీచేసినా అభ్యర్థుల నుంచి స్పందన లేక ఖాళీగా ఉన్న వాటిని ఓపెన్ కేటగిరీలోకి మారుస్తూ వైద్యారోగ్య శాఖ జూన్ 21న ఉత్తర్వులు జారీచేసింది. బోధనాసుపత్రుల్లో అదనంగా 2,190, ఖాళీగా ఉన్న 1,952 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ విమ్స్లో 31 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను ఓపెన్ కేటగిరీలోకి మార్చారు. ఇతర ఆస్పత్రుల్లో డయాలసిస్ టెక్నీషియన్, క్యాథ్లాబ్, ఎంఆర్ఐ, ఈసీజీ, ల్యాబ్, కార్డియాలజీ టెక్నీషియన్లు, స్పీచ్ థెరపిస్టు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఇతర పోస్టులను ఓపెన్ కేటగిరీలో భర్తీచేస్తారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.